హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ ప్రజల ప్రాణాలకు ఎసరు తెస్తోంది. అందరూ కాకున్నా దాదాపు 90శాతం రోడ్డుపక్కన వ్యాపారాలు, చిరుతిళ్ల సెంటర్లు నాణ్యతను, పరిశుభ్రతను గాలికొదిలేస్తున్నాయి. మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న మాదాపూర్ వంటి ప్రాంతాల్లో టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు రోడ్లను ఆక్రమిస్తున్నాయి. అసలే రోడ్లమీద సాఫీగా వెళ్లలేకుండా సాయంత్రమైందంటే చాలు ట్రాఫిక్ జామ్ చుక్కలు చూపిస్తుంది. దీనికి తోడు రోడ్లను ఆక్రమించుకుంటున్న స్ట్రీట్ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి.
ఈ ఫుడ్ సెంటర్లలో నాణ్యతను పరీక్షించాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు నెలనెలా మామూళ్లకు అలవాటు పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్లమీద ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాల్సిన కొందరు కిందిస్థాయి పోలీసులు సాయంత్రమైందంటే రోజువారీ వసూళ్లపర్వంలో మునిగిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో, కొందరు ఫుడ్ కోర్టులు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో కాలం చెల్లిన, కుళ్లిపోయిన పదార్థాలతో తినుబండారాలు తయారుచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన నూనెలు కాకుండా నకిలీ నూనెతో వంటకాలు చేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. నిత్యం ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నా.. వసూళ్లు, ఆమ్యామ్యాలకు అలవాటు పడిన సిబ్బంది, అధికారులు ఈ ఫిర్యాదులను చెత్తబుట్టలో పడేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది.నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్గాంధీ అరెస్ట్ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా…
- జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.జనరిక్ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
- సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
- రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
- మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 223731