తెలంగాణ రాష్ట్ర పదో తరగతి ఫలితాల్లో భాష్యం విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్లోని భాష్యం విద్యాసంస్థల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ రామ్ విద్యార్థులను అభినందించారు. ఈసారి ఫలితాల్లో పి. శృతి, ఆర్. గుణసాయి, శరణ్ రెడ్డి 600కి గాను 595 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. అలాగే వి.ఎస్.ఎన్. శరఘ్న, కె.ఎల్.డి.వి అనురాధ, కె. హనీషా 594 మార్కులు సాధించి ప్రతిభ చూపారు. మొత్తం 7 మంది విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించగా, 203 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు, 434 మంది విద్యార్థులు 570కి పైగా మార్కులు సాధించడం విశేషంగా నిలిచింది. విద్యార్థుల శ్రమ, ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే ఈ గొప్ప విజయాలు సాధ్యమయ్యాయని సాకేత్ రామ్ తెలిపారు. విద్యా విధానంలో సమగ్ర ప్రణాళికతో భాష్యం జైత్రయాత్ర కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు
తెలంగాణ టెన్త్ ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థల విజయం.
30
previous post




Total views : 61456