ఇరాన్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ఆంక్షలు..
ఇరాన్(Iran)తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ముందు తాము ఆంక్షలు విధిస్తామనే విషయాన్ని గుర్తెరగాలని పాకిస్థాన్(Pakistan)ను అగ్రరాజ్యం అమెరికా(America) హెచ్చరించింది. ఆంక్షలు విధించడంతో పాటు ఒప్పందాలకు అంతరాయం కలిగిస్తామని, ఇతర చర్యలకు ఉపక్రమిస్తామని వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్(Ballistic Missile Program) సరఫరాదారులపై అమెరికా ఆంక్షలు విధించడం యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ వేదాంత్ పటేల్ స్పందించారు. నెట్వర్క్ల విస్తరణ, విధ్వంసక ఆయుధాల సేకరణకు సంబంధించిన కార్యకలాపాలు ఎక్కడ జరిగినా తాము అంతరాయం కలిగిస్తామని, చర్యలను కొనసాగిస్తామని వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు.
ఇది చదవండి: ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో విజయం…
స్థూలంగా చెప్పాలంటే ఇరాన్తో వ్యాపార ఒప్పందాలను పరిగణించే ఎవరైనా ఆంక్షలు ఉంటాయనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఈ మేరకు అన్ని దేశాలకు సలహా ఇస్తున్నామని అన్నారు. ప్రజల వినాశనానికి సంబంధించిన ఆయుధాలు, వాటి పంపిణీని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఆంక్షలు విధించాల్సి వచ్చిందని ఒక ప్రశ్నకు వేదాంత్ పటేల్ సమాధానమిచ్చారు. పాకిస్థాన్ మిసైల్ ప్రోగ్రామ్కు సరఫరాదారులుగా ఉన్న కంపెనీలు చైనా, బెలారస్లో ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. ఈ కంపెనీలు పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి పరికరాలు, ఇతర వస్తువులను సరఫరా చేసినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మూడు రోజుల పాకిస్థాన్ సందర్శన నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా రైసీ పాక్ పర్యటనలో ఇరుదేశాలు 8 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు లూసియానాలోని టొరోడో పార్క్లోని సెబాన్ రివర్లోకి కోడూరు అనురూప్ రెడ్డి వెళ్లాడు. హఠాత్తుగా…
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్జీనియా రాష్ట్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి పలువాహనాలపైకి దూసుకెళ్లడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 34 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర…
- భారత్లో వ్యక్తిగత పర్యటనలో టిఫానీ ట్రంప్..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ ప్రస్తుతం భారత్లో వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె నారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని అద్భుత శిల్పకళ, నిర్మాణ వైభవాన్ని చూసి టిఫానీ ట్రంప్ మంత్రముగ్ధులయ్యారు. ఆలయ ప్రాంగణంలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి






Total views : 91175