బీజేపీ(YCP) మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారని కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తోసిపుచ్చారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉన్నంతవరకూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై పునరాలోచన ఉండదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ తమపై దుష్ప్రచారం సాగిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తాము పదేండ్లుగా పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నామని రిజర్వేషన్లకు స్వస్తి పలకాలని అనుకుంటే ఈపాటికే అలాంటి నిర్ణయం తీసుకునేవారమని అమిత్ షా పేర్కొన్నారు. రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన తమకు లేనేలేదని తేల్చిచెప్పారు. రాహుల్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నంతవరకూ రిజర్వేషన్లను తొలగించే అధికారం, దమ్ము ఎవరికీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే బీసీలు, దళితులు, ఆదివాసీ సోదరులకు భరోసా ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.
- తమిళనాడు కరూర్ జిల్లాలో రైలు ప్రమాదంతమిళనాడు కరూర్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. రైల్వే లెవెల్ క్రాసింగ్ను దాటేందుకు ప్రయత్నించిన కాలేజీ బస్సును గూడ్సు రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 23 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తాంతోణి సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన బస్సు..నిన్న…
- నేషనల్ హైవేలపై తరచుగా ప్రయాణించే వాహనదారుల జేబులకు ఏప్రిల్ 1 నుంచి మరికొంత చిల్లు పడనుంది..నేషనల్ హైవేలపై తరచుగా ప్రయాణించే వాహనదారుల జేబులకు ఏప్రిల్ 1 నుంచి మరికొంత చిల్లు పడనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టోల్ ధరలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా – NHAI పెంచింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వార్షిక…
- ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధంపై భారతీయుల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ అస్సాంలోని సిల్చార్లో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.