బీజేపీ(YCP) మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారని కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తోసిపుచ్చారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉన్నంతవరకూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై పునరాలోచన ఉండదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ తమపై దుష్ప్రచారం సాగిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తాము పదేండ్లుగా పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నామని రిజర్వేషన్లకు స్వస్తి పలకాలని అనుకుంటే ఈపాటికే అలాంటి నిర్ణయం తీసుకునేవారమని అమిత్ షా పేర్కొన్నారు. రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన తమకు లేనేలేదని తేల్చిచెప్పారు. రాహుల్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నంతవరకూ రిజర్వేషన్లను తొలగించే అధికారం, దమ్ము ఎవరికీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే బీసీలు, దళితులు, ఆదివాసీ సోదరులకు భరోసా ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.
- నీట్ లీక్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో బయటికొస్తున్నాయి. రాజస్థాన్ నుంచి గురుగ్రామ్, నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా, సీబీఐ విచారణతో…
- కేరళంలోని వయనాడ్లో పోస్టర్ల కలకలం.కేరళ సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం సీటు కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండగా..ఈ వ్యవహారంతో కేరళ కాంగ్రెస్ లో విభేదాలు పెరిగిపోతున్నాయి..ఈ నేపథ్యంలోనే రాహుల్, ప్రియాంకలకు వ్యతిరేకంగా వయనాడ్లో పోస్టర్లు వెలిశాయి. వయనాడ్ జిల్లా కాంగ్రెస్…
- పూణేలో కూలిన శిక్షణ విమానం..మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్కు గాయాలయ్యాయి. రెడ్బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 75371