బీజేపీ(YCP) మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారని కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తోసిపుచ్చారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉన్నంతవరకూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై పునరాలోచన ఉండదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ తమపై దుష్ప్రచారం సాగిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తాము పదేండ్లుగా పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నామని రిజర్వేషన్లకు స్వస్తి పలకాలని అనుకుంటే ఈపాటికే అలాంటి నిర్ణయం తీసుకునేవారమని అమిత్ షా పేర్కొన్నారు. రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన తమకు లేనేలేదని తేల్చిచెప్పారు. రాహుల్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నంతవరకూ రిజర్వేషన్లను తొలగించే అధికారం, దమ్ము ఎవరికీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే బీసీలు, దళితులు, ఆదివాసీ సోదరులకు భరోసా ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.
- AIADMKకు మరో షాక్.తమిళనాడు రాజకీయాల్లో ఎమ్మెల్యేల రాజీనామా పర్వం కంటిన్యూ అవుతోంది. రాష్ట్రంలో టీవీకే నేతృత్వంలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు ఐదుగురు AIADMK ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తాజాగా అదే బాటలో మరో ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా…
- భారత్కి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం అలర్ట్.విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా, బుండిబుగ్యో వైరస్ల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ విజ్ఞప్తి మేరకు పౌరవిమానయాన శాఖ ఈ అప్రమత్తత ఉత్తర్వులను విడుదల…
- సెషెల్స్లో ప్రధాని మోదీ పర్యటన.భారత ప్రధాని నరేంద్ర మోదీకి సీషెల్స్లో ఘన స్వాగతం లభించింది. సీషెల్స్ జాతీయ దినోత్సవ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొనేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం అక్కడికి చేరుకున్న ప్రధానికి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 181138