శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారులవాయిద్యాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వాహనసేవలో పెద్ద సంఖ్యలో భక్తులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు.
Chittoor
శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి భక్త కన్నప్ప ధ్వజారోహణం అంకురార్పణ తో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
బ్రహ్మోత్సవాలలో రోజు వారి కార్యక్రమాల వివరాలు :
మొదటి రోజు తేది 03 న ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీకన్నప్ప ద్వజారోహణం, అంకురార్పణ
రెండవ రోజు తేది 04 న సోమవారం (దేవ రాత్రి) ఉదయం 8.30 గం.లకు వెండి అంబారి వాహన సేవ, మద్యాహ్నం 12.30 గం.లకు శ్రీస్వామి వారి ద్వజారోహణం ప్రారంభం, రాత్రి 8 గం.లకు వెండి అంబారి సేవ
మూడవ రోజు తేది 05 న (భూత రాత్రి) మంగళవారం ఉదయం 9 గం.లకు సూర్యప్రభ – చప్పర వాహన సేవ, రాత్రి 8 గం.లకు భూత – శుక్ర వాహన సేవ
నాల్గవ రోజు తేది 06 న (గాంధర్వ రాత్రి) బుధవారం ఉదయం 9 గం.లకు హంస – యాళి వాహన సేవ, రాత్రి 8 గం.లకు రావణుడు – మయూర వాహన సేవ
ఐదవ రోజు తేది 07 న ( నాగ రాత్రి) గురువారం ఉదయం 9 గం.లకు హంస – శుక్ర వాహన సేవ, రాత్రి 8 గం. లకు శేష వాహనం – యాళి వాహన సేవ
ఆరవ రోజు తేది 08 న (మహా శివరాత్రి) శుక్రవారం ఉదయం 10.30 గం.లకు ఇంద్ర విమానం – చప్పర సేవ, రాత్రి 9.30 గంటలకు నంది – సింహ వాహన సేవ
ఏడవ రోజు తేది 09 న (బ్రహ్మ రాత్రి) శనివారం ఉదయం 11 గం.లకు రథోత్సవం, రాత్రి 8 గం.లకు తెప్పోత్సవం
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఎనిమిదవ రోజు తేది 10 న (స్కంద రాత్రి) ఆదివారం శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం ఉదయం 9 గంటలకు అధికార నంది– కామధేనువు వాహనం, రాత్రి 9. గం.లకు గజ – సింహ వాహన సేవ
తొమ్మిదవ రోజు తేది 11 న (ఆనంద రాత్రి) సోమవారం ఉదయం 11 గం. లకు రుద్రాక్ష అంబారి వాహన సేవ, రాత్రి 7గం.లకు శ్రీసభాపతి కల్యాణం
పదవ రోజు తేది 12 న (ఋషి రాత్రి) మంగళవారం కైలాస గిరి ప్రదక్షిణ (కొండ చుట్టు) ఉదయం 7.15 గం.లకు ఐనాత అంబారి వాహన సేవ, రాత్రి అశ్వం – సింహ వాహన సేవ ప్రారంభం.
పదకొండవ రోజు తేది 13 న (దేవ రాత్రి) బుధవారం మద్యాహ్నం 11.30 గం.లకు తీర్థవారి ద్వజావరోహణం
పన్నెండవ రోజు తేది 14 న గురువారం రాత్రి 8 గం.లకు పల్లకీ సేవ
పదమూడవ రోజు తేది 15 న (మోహ రాత్రి) శుక్రవారం రాత్రి 9 గం.లకు ఏకాంత సేవ
14 వ రోజు తేది 16 న శనివారం ఉదయం 9.30 గంటలకు శాంతి అభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఇది చదవండి: జగన్ కు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
హథీరాంజీ మఠంలో పంచనామ నిర్వహించారు. ఈ పంచనామలో వెండి వస్తువులు, బంగారు నాణెం లభించాయని హథీరాంజీ మఠం ఏవో రమేష్ నాయుడు తెలిపారు. మీడియా సమావేశంలో ఏవో రమేష్ నాయిడు మాట్లాడుతూ.. గత మహంతు అర్జున్ దాస్ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. చట్టవ్యతిరేకంగా ఎన్ఓసీ లు చేసారని తెలిపారు. మఠం భూములు అమ్మడానికి మహంత్ కి అధికారం లేదన్నారు. ఇవే కాకుండా వారి కుటుంబ సభ్యులు, బంధువులకు కమిషనర్ అనుమతి లేకుండా చేసారన్నారు. ఉన్న అభియోగాలకు సమాదానం కూడా ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం కోర్ట్ పరిధిలో ఉందిని మఠం ఉద్యోగులపై కూడా దౌర్జన్యం అర్జున్ దాస్ చేసారన్నారు. తిరుపతిలో మఠం భూములు కొనుగోలు చేసి మోసపోకండి, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హథీరాంజీ మఠానికి నూతన మహంతు నియామకమన్నారు. ఓం ప్రకాశ్ దాస్ తాత్కాలిక మహంతుగా నేడు నియమించిన ఏపీ ధార్మిక పరిషత నియమించిందని.. గత మహంతు అక్రమాలకు పాల్పడటంతో తొలగించమన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణ., రాష్ట్ర మంత్రి కారంపూడి నాగేశ్వరరావు., టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ., టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ మాట్లాడుతూ.. తమిళనాడులో గత మూడేళ్లుగా విపరింతంగా గంజాయి., మత్తుపదార్థాల విక్రయాలు సాగుతున్నాయన్నారు. మత్తుపదార్థాలపై కథనాలు తీసే సమయంలో పత్రిక విలేకర్లపై దాడికి డిఎంకే నాయకులు తిరగబడ్డారని అన్నారు. ఎమర్జెన్సీ పాలన తమిళనాడులో కనిపిస్తుందన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: త్రివేణి హైస్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
తిరుపతి జిల్లా(Tirupati) దొరవారి సత్రం మండలం వడ్డికండ్రిగలో విషజ్వరాలతో గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. వారం రోజులు నుండి విష జ్వరాలతో బాధపడుతూ పరిస్థితి విషమించడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. రక్తకణాలు పూర్తిగా తగ్గిపోయి లివర్ చెడిపోవడంతో నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అంకయ్య మరణించాడు.
ఇది చదవండి: సీట్ల సర్దుబాటుపై సీవీఆర్ న్యూస్ ప్రత్యేక కథనం…
అంకయ్యనే కాదు ఒక నెల నుండి గ్రామంలో ప్రతి ఇంట్లో విషజ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు. హాస్పిటల్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రభుత్వ వైద్య సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. సచివాలయ సిబ్బంది కూడా ఎన్నికల డ్యూటీలో పడి గ్రామాలను గాలికి వదిలేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
Bhumana Abhinay :
భూమన అభినయ్ కి తిరుపతిలో బలిజ కులస్థులంతా అండగా ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భూమన అభినయ్ కి బలిజ కులస్థులంతా ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని నిర్ణయించారు. గతంలో తమ కులానికి చెందిన ప్రజా ప్రతినిధులు, టీటీడీ చైర్మన్ లు కూడా తమకు న్యాయం చేయలేదని, భూమన కరుణాకర రెడ్డి, భూమన అభినయ్ ఆధ్వర్యంలో బలిజ కులస్థులకు న్యాయం చేశారని కొనియాడారు. బలిజ కులస్థులను ఇంతగా ఆదరించిన వారు లేరన్నారు. బలిజ కులస్థులుగా తమపై భూమన కుటుంబం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, భూమన అభినయ్ విజయం కోసం అంకిత భావంతో కృషి చేద్దామని పిలుపు నిచ్చారు. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ రెడ్డి మాట్లాడుతూ మా కుటుంబాన్ని కాపు గాచిన కాపు సామాజిక వర్గ ప్రజలను ఎన్నటికీ మరవను అని మీరు చూపిన ప్రేమ, ఆదరణాభిమానాలు అంతా ఇంతా కాదు అని, మీకు ఎంత చేసినా మీ రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేను అని భూమన అభినయ్ అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మన అభిమాన నాయకుడు భూమన కరుణాకర రెడ్డి విజయంలో మీరు కీలక పాత్ర పోషించారు. ఈ ఎన్నికల్లో నాకు మీ అందరి మద్దతు ఇవ్వమని నేను అభ్యర్థిస్థున్నా అందరి సహకారంతో తిరుపతిలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి, అభివృద్ధి చేశాం. తిరుపతి ని మరింతగా మారుస్తానని మీకు హామీ ఇస్తున్నా అన్నారు. నా వైపు నిలబడమని విజ్ఞప్తి చేస్తున్నాను. నా గురించి నలుగురికి చెప్పండి, నా గెలుపు కోసం కృషి చేయండి. మీకు రుణ పడి ఉంటానని అభినయ రెడ్డి అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ భూమన అభినయ్ విజయం ఆకాంక్షించి, బలిజ సామాజిక వర్గమంతా ఏక తాటిపై నిలబడుతున్నందుకు సంతోషంగా ఉందని, నేడు జరిగిన బలిజ కులస్థుల ఆత్మీయ సమావేశంలో అంత చక్కటి ప్రసంగాలతో మా పై ఉన్న అభిమానాన్ని మరో సారి చాటుకున్న ప్రతి ఒక్కరికీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కృతజ్ణతలు తెలిపారు.
భూమన అభినయ్ కి మద్ధతుగా నిలబడి, ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలంతా కలిసి ఉంటే ఎలా మంచి జరుగుతుంది అనేందుకు తిరుపతి అభివృద్ధి చక్కటి ఉదాహరణ అన్నారు. 75 ఏళ్లలో జరగని అభివృద్ధి, జగనన్న చొరవ, ఈ రోజు మీ అందరి సహకారం తోనే జరిగిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమితులైనప్పటి నుంచి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చానని, అటు ఉద్యోగులు, ఇటు భక్తులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కృషి చేశానని, ఇన్ని ఆలోచనలు ఉన్న నా కంటే మన భూమన అభినయ్ ఇంకా గొప్పగా ఆలోచించ గలవాడు, భూమన అభినయ్ ని ఎమ్మెల్యే గా గెలిపించుకుంటే నా కంటే గొప్పగా ప్రజలకు సేవ చేయగలడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నీలం బాలాజి, తిరుమల నిర్వాసితులు చిన్నమని, బెల్లం రమేష్, ప్రవీణ్ రాయల్, ప్రవీణ్, చంద్ర రాయల్, రాము తదితర తిరుమల నిర్వాసితులు, తిరుపతి బలిజ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కారులో కర్ణాటక మద్యం తరలిస్తున్న నిందితున్ని మదనపల్లి తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించి సీఐ శేఖర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నందలూరుకు చెందిన పులి నవీన్ (38) కర్ణాటక నుంచి కర్ణాటక మద్యం తీసుకుని వస్తుండగా, మదనపల్లి బెంగళూరు రోడ్డులోని బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో నిందితుడు మద్యంతో సహా పట్టుబడినట్లు తెలిపారు. పట్టుబడ్డ నిందితుని వద్ద రూ 20 వేల విలువ చేసే కర్ణాటక మధ్యం, కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందన్నారు. విచారణ అనంతరం అతనిపై అక్రమ మద్యం తరలింపు పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీఐ పేర్కొన్నారు.
రేణిగుంట మండలానికి చెందిన ప్రజలకు 70% ఏర్పేడు మండలం చిందేపల్లి జగనన్న ఇంటి పట్టాలను కేటాయించారు. అయితే ఆ భూముల పైన అక్కడి రైతులు సరైన నష్టపరిహారం చెల్లించలేదని కోర్టుకు పోయారు. దీంతో అక్కడ ఇంటి పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇంటి స్థలాలు చూపించలేదు. దీంతో మొదటి నుండి రేణిగుంట మండలం వామపక్ష పార్టీ నాయకులు నిరసన తెలియజేస్తూ వచ్చారు. అయితే ఒక నెల క్రితం కరకంబాడి పంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 153 లోని 125 ఎకరాల ప్రభుత్వ భూములో నీ 44 ఎకరాల్లో ఎర్రగుట్ట పైన వామపక్ష నాయకులు ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి ఆక్రమించుకొని గుడారాలు నిర్మించుకున్నారు. అప్పటి నుంచి పలు దఫాలుగా రెవెన్యూ శాఖ, పోలీసులు ఆ స్థలాన్ని ఖాళీ చేపించేందుకు ప్రయత్నం చేసిన విఫలం చెందారు. కడకు వామపక్ష నాయకులతో రెవిన్యూ శాఖ చర్చలు జరిపిన వారు మాట వినకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు భారీ ఎత్తున పోలీసులు, రెవెన్యూ శాఖ, అగ్నిమాపక సిబ్బంది. ఆక్రమించుకున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి బలవంతంగా కాళీ చేయించారు. కాళీ చేపించే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. దీనిపై సిపిఎం నాయకులు వైసీపీ ప్రభుత్వం చేసిన పనిని ఖండిస్తూ, ఆ పార్టీ పై దుమ్మెత్తి పోశారు.
చిత్తూరు జిల్లాలో ఏనుగులు సైర్వ విహారం చేస్తున్నాయి. కుప్పం మండలంలో ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తోంది. అడవిలో నీరులేక పంటపొలాలను సర్వ నాశనం చేస్తున్నాయి. గజరాజులను అడవిలోకి మళ్లించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ వేకువ జామున పైపాళ్యం గ్రామానికి చెందిన మునిరత్నంపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో రైతు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయడంతో కిందపడి గాయాలయ్యాయి. ప్రస్తుతం రైతు కుప్పం వైద్యకళాశాలలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగుల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.
ఇది చదవండి: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Intinti Telugudesam program :
గంగవరం మండలంలో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. గంగవరం మండలంలో పండుగ వాతావరణం నెలకొంది మాజీ మంత్రి అమర్నాథరెడ్డి రాకతో ఇంటింటి దగ్గర హారతులు చేపట్టారు. తమ బాధను కష్టాలను మాజీ మంత్రి అమర్నాథరెడ్డికి ప్రజలు చెప్పుకున్నారు. గంగవరం రైతులు సెరికల్చర్ పైన ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు అంటూ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులని ఆదుకున్నాడని మీకు గుర్తు చేస్తున్నానని ఆయన అన్నారు. ఈ నాలుగున్నర సంవత్సరంలో సెరికల్చర్ ద్వారా రైతుకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ మేపుకునే దానికి మందులు కానీ బిల్డింగ్స్ గాని ఈ ప్రభుత్వం ఆదుకోలేదని రైతులను చిన్నచూపు చూస్తా ఉందని అన్నారు. సెరికల్చర్ రైతులు డ్రిప్పు పైన ఆధారపడతారు నాలుగు ముఖాల సంవత్సరాలుగా డ్రిప్పు పైపులు ఇవ్వని ఈ ప్రభుత్వం రైతులను ఎలా ఆదుకుంటుందని అన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
గంగవరం ప్రాంతంలో ఆటోనగర్ కావాలని చిన్న చిన్న ఇండస్ట్రీలు వస్తే ఈ గ్రామ పంచాయతీలో ఉండే యువకులకు ఉపాధి అవకాశాలు వస్తాయని గత ప్రభుత్వంలోనే ఒక సంవత్సరంలోనే చేశాను. ఈరోజు బైపాస్ పక్కలో ఆటోనగర్ ఉంది అక్కడ ఉపాధి అవకాశాలు వస్తున్నాయా లేదా కండ్లకు కట్టినట్లు కనిపిస్తా ఉందని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెదిరించడం భయపెట్టడం కేసులు పెట్టడం తప్పిస్తే ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. మళ్లీ రాష్ట్రానికి యువతల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అధికారాన్ని తీసుకొని రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. మీరు ఓట్లు వేసి గెలిపించి అక్కడ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలి ఇక్కడ నన్ను శాసనసభ్యుడుగా గెలిపించాలి అంటూ అమర్నాథరెడ్డి ప్రసంగించారు.






Total views : 198798