చిత్తూరు జిల్లా.. గంగవరం మండలానికి చెందిన ఇద్దరు చిన్నారులు మాజీ మంత్రి అమర్నాథరెడ్డి (Amarnath Reddy) పై తమ వెలకట్టలేని అభిమానాన్ని చాటుకున్నారు. ఆ చిన్నారుల కోరిక మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వివరాల్లోకెళ్తే… గంగవరం మండలం మేలుమాయి పంచాయతీలోని గుండ్లపల్లి గ్రామంలో మాజీ మంత్రి అమరనాథ రెడ్డి నాలుగు నెలల క్రితం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన జయరామి రెడ్డి కుమార్తెలు గీతిక మరియు షాలినీలు తమ పొదుపు చేసి దాచుకున్న (కిడ్డి బ్యాంకు) హుండీ సొమ్మును ఆయనకు అందించి ఈ సొమ్మును నామినేషన్ కొరకు వాడుకోవాలని కోరారు. దీంతో చిన్నారులు అభిమానంగా అందించిన ఆ హుండీని దేవాలయంలో పూజల అనంతరం పగలగొట్టి అందులోని రూ.4701 సొమ్మును నామినేషన్ దరఖాస్తు సొమ్ము కొరకు వాడుకొని ఆ చిన్నారుల కోరికను తీర్చారు. ఈ అంశాన్ని చూసిన పలువురు ఓ వైపు చిన్నారుల అభిమానం వెలకట్టలేనిదైతే, ఆ అంశాన్ని నాలుగు నెలల తర్వాత కూడా గుర్తుంచుకొని మాజీ మంత్రి వారి కోరికను తీర్చడం గొప్ప విషయమని కొనియాడారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- మంగళగిరిలో కాపర్ వైర్ చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్న ముఠాను గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. కాజా టోల్గేట్ సమీపంలోని ప్రభల్ టెక్ పార్క్లో చోరీకి గురైన ఎలక్ట్రికల్ వైర్ల కేసును ఛేదించిన పోలీసులు…
- ఏలూరు జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్కు విస్తృత ఏర్పాట్లు.ఏలూరు జిల్లాలో ఈ నెల 24న నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 1,772 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా…