విశాఖపట్నంలో పెను ప్రమాదం తప్పింది. జనతా బజార్ కారుల స్క్రాప్ దుకాణంల్లో మంటలు అంటుకున్నాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటల ను అదుపులోకి ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి అధికారులు పీల్చుకున్నారు. షార్ట్ సార్క్యూట్ తో ప్రమాదం జరిగి ఉంటాదాని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Vishakapattanam
విశాఖలో విజిలెన్స్ ఎస్పీ స్వరూప రాణి ఆధ్వర్యంలో జరిగిన ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. జగదాంబ జంక్షన్ లోని హెలపురి రెస్టారెంట్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కుళ్లిపోయిన మాంసం అమ్మకానికి పెట్టినట్టు అధికారులు గుర్తించారు. అనంతరం మధురవాడలోని జీ షాన్ రెస్టారెంట్ పై ఆకస్మిక తనిఖీలు చేశారు. బిర్యానిలో బొద్దింక వచ్చిందని ఫిర్యాదు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేశామని తెలిపారు. ఈ దాడులలో కల్మి కబాబ్, బిర్యానీ శాంపిల్స్ ను సేకరించారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్, శానిటేషన్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించాయి.
విశాఖ జూ పార్క్ లో సోమవారం ఉదయం ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న నగేష్ అనే యువకుడు సోమవారం ఉదయం జూ పార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తుండగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. ఎలుగుబంటి బోనులో ఉందనుకొని అతడు క్లీనింగ్లు చేస్తుండగా సంఘటన సంభవించింది. ఎలుగుబంటి బోనుకు వేసి ఉన్న తలుపులు ఎప్పుడు తీర్చుకున్నాయో, ఎవరు తెరిచి ఉంచారో తెలియాల్సి ఉంది. జూలో ఉన్న సందర్శకులు అందరూ చూస్తుండగానే ఈ ఎలుగుబంటి ఆ యువకుడి పై దాడి చేయడం జరగడంతో సందర్శకులు భయకంపితులయ్యారు. సంఘటనను గుర్తించిన జూ అధికారులు వెంటనే స్పందించి ఆ ఎలుగుబంటిని బంధించారు. తీవ్ర గాయాల పాలైన ఆ ఉద్యోగి నగేష్ ను ఆసుపత్రికి తరలించగా అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో జూలోని సందర్శకులు అంతా అయోమయానికి గురయ్యారు. జూలో సిబ్బంది కి, సందర్శకులకు భద్రత కరువైందని ప్రజలు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి ఆరిలోవ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి చందనమాల దీక్ష ఈరోజు నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 41 రోజులు, అలాగే 32 రోజుల దీక్ష తీసుకునే వారికి జనవరి ఆరో తారీకున ముగిస్తుందని, ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ మరియు విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా స్వామివారి భక్తులు చందనమాలను వేసుకోవడానికి భారీగా తరలివచ్చారు. స్వామి వారి దీక్ష తీసుకున్న వారందరికీ ప్రత్యేక దర్శనం, బిక్ష ఏర్పాటు చేశామని, అలాగే దీక్ష తీసుకున్న వారికి స్వామి వారి కండువా ప్రతిమ, పంచ మహిళలకు చీరా, రవికా అందిస్తూ స్వామివారి దీక్షని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామంటున్న సింహాచలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.
Read Also..
Read Also..
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోకల్ బాయ్ నాని ప్రమేయం ఏమీ లేదని తేల్చారు. ఆ ఘటనకు కారకులైన వాసుపల్లి నాని, అతని మేన మామ సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనతో తమ వారికి ఏం సంబంధం లేదనీ.. వారిని విడిచి పెట్టాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు.ఘటన సమయంలో అసలు వాళ్లు అక్కడ లేరని.. తప్పుడు సాక్ష్యలతో అరెస్ట్ చేసారని ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో పోలీసులకు, మత్స్యకార మహిళలకు మధ్య తోపులాట జరిగింది.వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మొహరించారు. ఆగ్రహానికి గురైన మత్స్యకార మహిళలు రోడ్డుపై బైఠాయించడంతో..ఆందోళనకారులను పోలీసులు వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేశారు.
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన బాధితులకు ఆర్థిక సాయం చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు పూర్తిగా బోట్లు కోల్పోయిన వారికి రూ.లక్ష చొప్పున అందించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పాక్షికంగా బోట్లు పాడైపోయిన వారికి రూ.50 వేలు, బోటుకలాశీలకు రూ.5 వేల చొప్పున పార్టీ ఆర్థికసాయం అందించనుంది. ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కోల్పోయిన బాధితులను పూర్తిగా ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. చేసే సాయానికి కూడా అంతశాతం..ఇంతశాతం అంటూ అంటూ కొర్రీలు విధించింది. బాధితులకు బాసటగా నిలబడేందుకే ఆర్థిక సాయం అందించేందుకు టీడీపీ ముందుకు వచ్చింది. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధితులకు కొత్తబోట్లు అందించడంతో పాటు అన్ని విధాలా ఆదుకుంటాం.
అల్లూరి జిల్లా జీకే విధి మండలం సప్పర్ల ఘాట్ రోడ్డులో ధర్మపురం వద్ద కారు బోల్తా పడింది. కారులో ఏడుగురు ప్రయాణిస్తుండగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ కాపీ తోట పనులు చేస్తున్న గిరిజన రైతులు ప్రమాద స్థలం వద్దకు చేరుకుని క్షతగాత్రులను బయటకి తీసి దారకొండ హాస్పిటల్ కు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రైవేట్ సెల్ టవర్ సిబ్బందిగా తెలుస్తుంది.
ఏపీ రాజధానిని విశాఖకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పలు శాఖల మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారుల కార్యాలయాలకు విశాఖలో భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన పనులు జరిగిపోతున్నాయి. విశాఖకు పాలనా రాజధానిని మారుస్తున్నట్టు ఏ క్షణంలోనైనా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖకు ఎందుకు వస్తున్నారు? దేని కోసం వస్తున్నారని గంటా ప్రశ్నించారు. అడ్డదారిలో విశాఖకు రావాల్సిన అవసరం ఏముందని అడిగారు. ఇందులో రాజకీయ లబ్ధి తప్ప, ప్రజలకు ఉపయోగపడేదేమీ లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోబోతోందని ఈ 3 నెలల ముచ్చట కోసం ప్రజాధనాన్ని తగలేస్తున్నారని విమర్శించారు. విశాఖలో పులివెందుల పంచాయితీలు నడుస్తున్నాయని దుయ్యబట్టారు. విశాఖ ప్రజల ఆవేదన వైసీపీకి పట్టడం లేదని అన్నారు.
విశాఖ హార్చర్ అగ్నిప్రమాదం పై చిక్కుముడి వీడింది. రాజకీయ రంగు పులుముకున్నఈ ఘటనలో అసలు విషయం బయటకు వచ్చింది. విశాఖ ఫిషింగ్ హార్చర్ చరిత్రలో ఎన్నడూ జరగని ఈ భారీ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ప్రమాదానికి ఉప్పు చేప కాదు చిన్న సిగరెట్ ముక్క కారణమని తేలింది. ప్రధాన నిందితులు వాసుపల్లి నాని, అతని మామ వెంకటేష్ గా పోలీసులు గుర్తించారు. ఈనెల 19న రాత్రి కొందరు వ్యక్తులు హార్బర్లో పార్టీ చేసుకున్నారు. మందులో నంజుకోవడానికి ఉప్పుచేపను వేయించారు. ఆ చేపను తిన్న తర్వాత మద్యం మత్తులో కాల్చిన సిగరెట్ ముక్క పక్క బోటులోకి విసిరేశారు. సిగరెట్ ముక్క బోటు ఇంజిన్ పై పడింది. అలా ఆ సిగరెట్ నుంచి మొదలైన చిన్న నిప్పు ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా, మరో 19 బోట్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. మద్యం మత్తులో చేసిన ఈ చిన్న తప్పిదం గంగపుత్రులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. కళ్లెదుటే తమ జీవనాధారం బూడిదవ్వటంతో మత్స్యకారులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా ఘటన జరిగి 48 గంటలు గడవక ముందే ప్రభుత్వం వేగంగా స్పందించి 49 మంది బాధితులకు ఏడు కోట్ల పదకొండు లక్షల నష్టపరిహారాన్నిఅందించి ఆదుకుంది.
చింతపల్లి సాయిబాబా గుడి సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం. అదుపుతప్పి పెళ్లి బృందం బస్సు పల్టీ. ప్రమాదంలో మహిళ మృతి, సుమారు 20 మందికి గాయాలు,పలువురి పరిస్థితి విషమం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు. ఘటనా స్థలంలో క్షతగాత్రుల హాహాకారాలు. క్షతగాత్రులను హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు. గుంటూరు జిల్లా వినుకొండ నుంచి హైద్రాబాద్ లోని ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా దుర్ఘటన. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని అనుమానం.




Total views : 223654