విజయవాడ ధర్నా చౌక్లో తాగునీటి పథకాల కార్మికులు ఆందోళనకు దిగారు. CPWS, సత్యసాయి ఫ్రెష్ వాటర్ స్కీమ్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 వేల మంది వాల్వ్ ఆపరేటర్లు, పంప్ ఆపరేటర్లు, మెకానిక్స్, ఎలక్ట్రిషియన్లు, ఇతర సిబ్బంది తాగునీటి సరఫరా సేవలు అందిస్తున్నారని తెలిపారు.ప్రభుత్వం నిర్ణయించిన వేతనాల ప్రకారం జీతాలు చెల్లించడం లేదని, కాంట్రాక్టర్లు తక్కువ మొత్తాలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. కొన్ని జిల్లాల్లో 10 నుంచి 20 నెలల వరకు జీతాలు పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. EPF, ESI సదుపాయాలు అమలు చేయాలని, పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని, జీతాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం తీసుకురావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు.
విజయవాడ ధర్నా చౌక్లో CPWS కార్మికుల ఆందోళన.
28
previous post



Total views : 221433