Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Telangana హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం – కిషన్ రెడ్డి

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం – కిషన్ రెడ్డి

by Satya
Kishan Reddy

ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పూర్తిగా విఫలమైందని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy). రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందన్నారు. హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ 44వ ఆవిర్భావ వేడుకల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. గొప్పగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేయించలేని రాహుల్ గాంధీ.. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నించారు.

ఇది చదవండి: జగిత్యాల ఆర్టీసీ బస్టాండ్ లో మహిళ వద్ద నగలు చోరీ..

సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ.. పథకాల అమలుపై లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల దృష్టి ఇప్పుడు బీజేపీపై ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకే ఓటేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోసం మేనిఫెస్టోను ప్రకటించడం కాదని.. ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కిషన్ రెడ్డి హితవు పలికారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. ప్రజల సమస్యలను త్వరితగతిన …
హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్ …
మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .
తెలంగాణలో ఆశా వర్కర్లు మరోసారి రోడ్డెక్కారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014630
Total views : 80634

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.