Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra PradeshKarnool గుత్తి తాహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా..

గుత్తి తాహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా..

by Rama
Darna

అనంతపురం జిల్లా గుత్తి మండలం తాహసిల్దార్ కార్యాలయం వద్ద గుత్తి మండల యూనిట్ పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షనర్లు తమ అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదు ప్రధానమైన డిమాండ్లతో నేడు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ప్రెసిడెంట్ అబూబాకర్ మాట్లాడుతూ 11వ పిఆర్సి లో తగ్గించిన అదనపు పెన్షన్ను తిరిగి యధావిధిగా అంతకుముందు ఇస్తున్నట్లు 70 సంవత్సరాలు నిండిన వారికి 10% 75 సంవత్సరాలు నిండిన వారికి 15% కు పునరుద్ధరించాలని, పెండింగులో ఉన్న డి.ఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 11వ పిఆర్సి అరియర్స్ ను వెంటనే చెల్లించాలని, హెల్త్ కార్డు ద్వారా అన్ని వ్యాధులకు అన్ని గుర్తింపు పొందిన ఆస్పత్రులందు వైద్యం అందించాలని, మెడికల్ రీయంబర్స్మెంట్ పరిధిని రెండు లక్షల నుండి 5 లక్షల వరకు పెంచాలని ఈ సందర్బంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాహసిల్దార్ గారికి సమర్పించారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014487
Total views : 80359

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.