ప్రజలందరి సహకారంతో తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని ఐటి మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.
మంథనికి వెళ్తున్న శ్రీధర్ బాబుకు సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. కాంగ్రెస్ పాలన పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని, అంతేగాక ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంటుందని మంత్రి తెలిపారు. రాబోయే కాలంలో వ్యవసాయ, ఐటీ పరిశ్రమల రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచే కార్యచరణ రూపొందించి అమలు పరుస్తామన్నారు. గత ప్రభుత్వ పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే… వాటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే మేనిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారెంటీలతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. టిఎస్ పిఎస్సి ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ ను అమలుపరచి.. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం- దుద్దిల్ల శ్రీధర్ బాబు
289
previous post






Total views : 147211