Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Telangana మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు ప్రజలు ఘన స్వాగతం

మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు ప్రజలు ఘన స్వాగతం

by Prakash
daddhula sridhar babu

పెద్దపెల్లి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు సుల్తానాబాద్ లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. సుల్తానాబాద్ లోని ఆంజనేయస్వామి దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా మంత్రి బయలుదేరారు. పెద్దపల్లిలోని కమాన్ చౌరస్తా వద్ద మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ… పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్న మంథని రామగుండం, పెద్దపల్లి,ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచి మమ్మల్ని భారీ మెజారిటీలతో గెలిపించారని,ఈ ప్రాంత అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులలోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని, మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని అన్నారు. పెద్దపల్లిలో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే పెద్దపల్లి అభివృద్ధిపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, గత పది రోజులలో అనేకసార్లు పెద్దపల్లి, సుల్తానాబాద్ కు బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపో మంజూరు చేయాలని కోరారని, తప్పకుండా పెద్దపల్లి జిల్లా అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట నిలబెడతామని, ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

025362
Total views : 147066

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.