ధరణి పై అధ్యయన కమిటీ వేసిననందుకు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ వి. హనుమంతరావు ధన్యవాదాలు తెలిపారు. ధరణి పోర్టల్ వల్ల కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన భూములు అన్నీ అన్యాక్రాంతం అయ్యాయని వి. హనుమంతరావు అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో 96 ఎకరాల భూమిని కీసరలో పేద ప్రజలకు ఇచ్చిందని గుర్తుచేశారు. ఓఆర్ఆర్తో అక్కడి పేద రైతులు భూములు కోల్పోయారన్నారు. కీసర ఔటర్ రింగ్ రోడ్డు అనుమతుల్లో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు. దానిపై న్యాయ విచారణ చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆర్డర్లు ఉన్న లే అవుట్ కోసం హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చిందన్నారు. కీసర ఓఆర్ఆర్తో భూములు కోల్పోయిన పేద ప్రజలకు న్యాయం చేయాలని అధ్యాయన కమిటీకి లేఖ రాసినట్లు తెలిపారు. ధనవంతులకే లాభం చేసే ధరణిని ఎత్తివేయాలని వి.హనుమంతరావు పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన హనుమంతరావు…
346
previous post




Total views : 194924