Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra PradeshWest Godavari మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె..

మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె..

by Rama
Muncipal Workers Strike

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడం కారణంగా సమ్మె చేయడం జరుగుతుందని, ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనం 26,000 వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ సోర్స్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలనే ప్రధాన డిమాండ్లతో నాలుగు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, ప్రభుత్వంతో చర్చలు జరిపినా సఫలీకృతం కాకపోవడం వల్ల మూడు రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారని, కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంలో మున్సిపల్ కమిషనర్ స్వచ్ఛభారత్ పేరుతో సచివాలయం సానిటరీ సెక్రటరీ తో క్లీనింగ్ కార్యక్రమం చేపట్టారు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా స్వచ్ఛభారత్ పేరుతో సమ్మె ప్రారంభించిన రోజునే ఇలా చేయటం ఎవరికి ఉపయోగం కాదని ఏది ఏమైనా ప్రభుత్వనికి సమ్మె తొందరగా పరిష్కరించాలని చెప్పాలి. అదేవిధంగా ప్రధానమైన పారిశుద్ధ్యమంటే కను చూపులో ప్రభుత్వానికి ఎక్కడ కనబడుటలేదని పబ్లిక్ హెల్త్ కాపాడాలనుకుంటే పారిశుద్ధ్య శుభ్రంగా ఉంచాలని తెల్లవారుజామునే వీధుల్లో శుభ్రం చేస్తేనే పారిశుద్ధ్య శుభ్రంగా ఉంటుందని ఇప్పటికైనా ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని లేదంటే ఈ సమ్మె మా డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు కొనసాగుతుందని హెచ్చరించారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014155
Total views : 79221

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.