బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని, సభకు రాని కేసీఆర్ కు ఇంకా ప్రతిపక్ష హోదా ఎందుకు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేడు ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని మండిపడ్డారు. నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంలను లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న తమను ప్రశంసించకపోగా తిరిగి నిందలు వేయడం సరికాదన్నారు.
విద్యుత్తు శాఖపై గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని రాజగోపాల్రెడ్డి విమర్శించారు. అన్నీ సక్రమంగా ఉంటే మరి విద్యుత్తు సంస్థలు నష్టాల్లోకి ఎందుకు వెళ్తాయని ప్రశ్నించారు. రైతులకు అరకొరగా ఉచిత విద్యుత్తు ఇచ్చి బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుందని, నిజానికి నాడు, నేడు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నది ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమపై నిందలు వేయడం మాని, చేసిన తప్పులు ఒప్పుకోవాలని హితవు పలికారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి