Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News బ్యాంకులను భారీ ఎత్తున మోసగించిన నీరవ్ మోదీ.

బ్యాంకులను భారీ ఎత్తున మోసగించిన నీరవ్ మోదీ.

by CVR NEWS

బ్యాంకులను భారీ ఎత్తున మోసగించి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు రప్పించే ప్రక్రియ తుది దశకు చేరింది. తనను భారత్‌కు అప్పగించకుండా ఉండేందుకు యూకే కోర్టుల్లో అందుబాటులో ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను కోల్పోయిన తరువాత.. ఆయన ‘యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్’ను ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు ఉపశమనం లభించలేదు. దీంతో నీరవ్‌ను భారత్‌కు అప్పగించే ప్రక్రియను యూకే ప్రారంభించినట్లు తెలుస్తోంది. 2019 మార్చి నుంచి లండన్‌ జైలులో ఉన్న నీరవ్ మోదీపై పీఎన్‌బీ రుణ మోసం, మనీలాండరింగ్ కేసుల్లో విచారణ కొనసాగుతోంది. ఈ కేసుల్లో ఆయనను భారత్‌కు తీసుకురావాలని సీబీఐ, ఈడీ చాలా కాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

 

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

038916
Total views : 192687

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: