Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Latest News ఢిల్లీ పర్యటన కేంద్ర మంత్రులను కలవనున్న రేవంత్‌రెడ్డి

ఢిల్లీ పర్యటన కేంద్ర మంత్రులను కలవనున్న రేవంత్‌రెడ్డి

by Satya
Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఢిల్లీ వెళ్ళారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర బృందం పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నది. జాతీయ రహదారులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పలు ప్రతిపాదనలపై కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విషయమై సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీతో రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు నార్త్ బ్లాక్‌లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఏయే పద్దుల కింద ఎంత మొత్తంలో రావాలి, పెండింగ్‌లో ఉన్నవెన్ని తదితరాలను వివరించనున్నారు. దీర్ఘకాలంగా బకాయిగా ఉన్న నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే రిలీజ్ చేసేలా సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీని కోరనున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి వెనకబడిన జిల్లాల అభివృద్ధి స్కీమ్ కింద రావాల్సిన నిధుల గురించి ఇప్పటికే పలుమార్లు వివరించగా మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున విడుదల చేయాల్సిందిగా కోరనున్నారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
    నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్‌ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా…
  • సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
    ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
  • వికారాబాద్‌ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.
    వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున జరుగుతున్న గంజాయి సాగు కలకలం రేపింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆశ్రమంలో అక్రమంగా గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు.యాలాల మండలం గోవిందరావుపేట గ్రామ శివారులో హైదరాబాద్ బోరబండకు చెందిన పప్పులాల్ పది ఎకరాల భూమిని…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

042274
Total views : 223714

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: