బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేయాలని.. గ్రూపు తగాదాలకు ఇక స్వస్తి పలకాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో గెలవలేదని.. మన బలహీనతలే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం అయ్యాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కార్యకర్తలది తప్పు కాదని.. నాయకులుగా మనమే బాధ్యత వహించాలని సూచించారు. కాంగ్రెస్లో ఎవరు సమర్థులు ఉన్నారో ప్రజలు వాళ్లకు ఓట్లు వేశారని ప్రశ్నించారు. సంఖ్యా పరంగా కాంగ్రెస్ గెలువొచ్చు కానీ నైతికంగా బీఆర్ఎస్ గెలిచిందన్నారు. కేసీఆర్ మరోసారి తెలంగాణ సీఎం కానందుకు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకున్న కేడర్ మరే పార్టీకి లేదని, కష్టపడి పనిచేస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు రావడం కష్టమేమి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
304
previous post






Total views : 78671