Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh వైభవంగా ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

వైభవంగా ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

by Prakash
Srisaila Mahakshetra

శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లన్న భక్తులకు దేవస్థానం చేపట్టాల్సిన సౌకర్యాలపై ఇవాళ జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దేవస్థాన పరిసాలన భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ఈ సమీక్షకు కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలకు చెందిన అన్ని శాఖల అధికారులు హాజరుకానున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన పనులపై శాఖలవారీగా సమీక్ష నిర్వహిస్తారు. మంచినీటి సరఫరా, క్యూలైన్ల క్రమబద్ధీకరణ, వసతి, లైటింగ్ ఏర్పాట్లు, ఉత్సవ క్రతువులు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పార్కింగ్ ప్రదేశాలు, ఆరుబయలు తాత్కాలిక వసతి, శౌచాలయాలు తదితర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారని ఈఓ పెద్దిరాజు తెలిపారు ఈ సమావేశానికి మూడు జిల్లాల అధికారులు సిబ్బంది పాల్గొంటారు.

Advertisements

You may also like

Our Visitor

039475
Total views : 197013

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: