Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Telangana తల్లి మృతి.. అంత్యక్రియలకు ముందుకు రాని కొడుకులు…..

తల్లి మృతి.. అంత్యక్రియలకు ముందుకు రాని కొడుకులు…..

by Satya
తల్లి మృతి.. అంత్యక్రియలకు ముందుకు రాని కొడుకులు…..

మందమర్రి పట్టణంలో మానవత్వం మంట కలిసింది పాత బస్టాండ్ ఏరియాలో గల మున్సిపాలిటీ పక్కన ఉన్న కాలనీలో . రాగంశెట్టి మల్లక్క అనే వృద్ధురాలు ఒంటరిగా జీవనం సాగిస్తుంది… మల్లక్కకు తిరుపతి,వెంకటేశ్, సురేష్ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు… సురేష్ భారత సైన్యం ఆర్మీ జవాన్ గా పనిచేస్తున్నాడు.. అయితే ఉదయం అనారోగ్యంతో మల్లక్క మృతి చెందింది.. దీంతో కొడుకులకు స్థానికులు సమాచారం ఇచ్చారు అయితే.. అంత్యక్రియలు నిర్వహించేందుకు ముగ్గురు కొడుకులు ముందుకు రాలేదు.. విషయం తెలుసుకున్న కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. దీంతో వెనక్కు తగ్గిన కొడుకులు అంత్యక్రియను చేపట్టారు.. కన్నతల్లి మరణించిన అంత్యక్రియలకు ముందుకు రాకపోవడంతో ఈ ఘటన స్థానికులను కలచివేసింది ఈ ఘటనతో పలువురు స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు…

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
  • సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
    సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
  • భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.
    రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: