Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి…

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి…

by Prakash
Women on the road for drinking water

రాయదుర్గం పట్టణంలోని మొల్కల్ముర్ రోడ్డు గాంధీనగర్ నగర్లో గత 20 రోజులుగా తాగినీటి సమస్య నెలకొంది. దీంతో కాలనీ నివాసులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరని మండిపడ్డారు. ప్రతినెలా 150 రూపాయలు కట్టించుకున్న కానీ నీరు సరిగ్గా సరఫరా చేయలేక పోతున్నారని కాలనీ వాసుల ఆవేదన చెందారు. డబ్బులు ఎలాగైతే కట్టుంచుకుంటారో అలానే నీటిని కూడా సరఫరా చేయాలన్నారు. గత 20 రోజులుగా నీరు లేక నానా అవస్థలు పడుతున్నామని ఇప్పటికీ నీరు రాకపోతే మూత్రం సేవించి బ్రతకలా అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నీటి సరఫరాపై స్పందించాలని విన్నవించుకున్నారు.

Advertisements

You may also like

Our Visitor

014465
Total views : 80291

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.