కుప్పం నుండి బరుగూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు తమిళనాడు సరిహద్దు కనమూరు వద్ద ప్రమాదశాత్తు బోల్తా పడింది. తెల్లవారుజామున 5: 30 నిమిషాలకు కుప్పం ఆర్టీసీ డ్రైవర్ జై కుమార్ మలుపు తిరిగే సమయంలో బస్సు బోల్తా పడిందని డ్రైవర్ చెప్తున్నారు. ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకుడు కనకరాజు సంఘటనా స్థలానికి చేరుకొని టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గ మెరుగైన 120 బస్సులను గ్రామాలకు తరలించారన్నారు. అయితే ఈ జగన్ ప్రభుత్వంలో కుప్పం డిపోలో ఉన్న మంచి బస్సులను పుంగునూరుకు మంత్రి పెద్దిరెడ్డి తరలించుకున్నారు. పుంగునూరు డిపోలో ఉన్న డొక్కు బస్సులు ను కుప్పం డిపోకు వేసి ప్రయాణికుల తో చలగాటమాడుతున్నారు. ఇకనైనా మెరుగైన బస్సులను కుప్పం డిపోకు వేయాలని డిమాండ్ చేశారు.
బోల్తా పడిన బస్సు..
282
previous post





Total views : 78508