Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh జాతీయ రహదారిపై దోపిడీదారులను పట్టుకున్న పోలీసులు

జాతీయ రహదారిపై దోపిడీదారులను పట్టుకున్న పోలీసులు

by Satya
Cops who caught the looters

ఏలూరు శివారు జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు యువకులు, ఇద్దరు మైనర్లను పెదపాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఏలూరులోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు డీఎస్పీ అశోక్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి నిందితులు అనేక దారి దోపిడీలకు పాల్పడినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 2 ఆటోలు, 2 బైక్ లు, 2వేల 200 నగదును రికవరీ చేసినట్లు వెల్లడించారు. రెండు రోజుల క్రితం కలపర్రు టోల్ ప్లాజా వద్ద రాత్రి సమయంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీ డ్రైవర్ను కత్తితో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: