Wednesday, April 15, 2026
News Navigation
Wednesday, April 15, 2026
News Navigation

Breaking

Wednesday, April 15, 2026
Home Latest News ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న సబితా ఇంద్రారెడ్డి

ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న సబితా ఇంద్రారెడ్డి

by Rama
ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరంలోని ఆర్కేపురంలో ప్రజా సమస్యలను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అడిగి తెలుసుకున్నారు. గతంలో ప్రారంభించిన డ్రైనేజ్, వాటర్ లైన్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ నగర్ లో రోడ్ల సమస్య లేకుండా చూస్తామని సబితా తెలిపారు. చెత్తను రోడ్లపై వేయకుండా పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు సూచించారు. పరిసరాల పరిశుభ్రత మీద గత ప్రభుత్వంలో అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్టు గుర్తుచేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని పల్లెబాట బస్తిబాటలాంటి కార్యక్రమాలు చేపట్టినట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమాలు పల్లెలు, బస్తీలు పరిశుభ్రంగా ఉంచడానికి దోహ పడ్డాయని తెలిపారు. భవిష్యత్తులో నియోజకవర్గంలోని సమస్యలన్నిటిని పరిష్కరించడానికి ఎమ్మెల్యేగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..
    ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్‌రెడ్డి. డీలిమిటేషన్‍తో సౌత్‌ స్టేట్స్‌తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
  • భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..
    అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
  • హైదరాబాద్‌లో అంతులేకుండా పోతున్న రియల్‌ మోసాలు..
    హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు…
  • పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..
    పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్‌ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్‌ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

005709
Total views : 38445

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.