Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh అంగన్వాడి సెంటర్ తాళం తెరిచిన సచివాలయ ఉద్యోగులు…

అంగన్వాడి సెంటర్ తాళం తెరిచిన సచివాలయ ఉద్యోగులు…

by Prakash
Secretariat employees who opened the lock of Anganwadi Center...

ఏపీ లో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె నేటికీ 24 వ రోజుకు చేరుకోగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ అంగన్వాడీ సెంటర్ తాళం సచివాలయ ఉద్యోగులు తెరిచారు. సమాచారం అందుకున్న అంగన్వాడీ టీచర్లు సెంటర్ లో ఉన్న సచివాలయం ఉద్యోగులును బయటకు పంపి సెంటర్ కు తాళం వేసి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తుంటే, ఆ సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ద్వారా సెంటర్లను నడపాలని ప్రయత్నం చేస్తుందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: