హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ ప్రజల ప్రాణాలకు ఎసరు తెస్తోంది. అందరూ కాకున్నా దాదాపు 90శాతం రోడ్డుపక్కన వ్యాపారాలు, చిరుతిళ్ల సెంటర్లు నాణ్యతను, పరిశుభ్రతను గాలికొదిలేస్తున్నాయి. మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న మాదాపూర్ వంటి ప్రాంతాల్లో టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు రోడ్లను ఆక్రమిస్తున్నాయి. అసలే రోడ్లమీద సాఫీగా వెళ్లలేకుండా సాయంత్రమైందంటే చాలు ట్రాఫిక్ జామ్ చుక్కలు చూపిస్తుంది. దీనికి తోడు రోడ్లను ఆక్రమించుకుంటున్న స్ట్రీట్ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి.
ఈ ఫుడ్ సెంటర్లలో నాణ్యతను పరీక్షించాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు నెలనెలా మామూళ్లకు అలవాటు పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్లమీద ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాల్సిన కొందరు కిందిస్థాయి పోలీసులు సాయంత్రమైందంటే రోజువారీ వసూళ్లపర్వంలో మునిగిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో, కొందరు ఫుడ్ కోర్టులు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో కాలం చెల్లిన, కుళ్లిపోయిన పదార్థాలతో తినుబండారాలు తయారుచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన నూనెలు కాకుండా నకిలీ నూనెతో వంటకాలు చేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. నిత్యం ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నా.. వసూళ్లు, ఆమ్యామ్యాలకు అలవాటు పడిన సిబ్బంది, అధికారులు ఈ ఫిర్యాదులను చెత్తబుట్టలో పడేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90764