తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టలేరని, ఆ సాహసం చేస్తే ప్రజలే వారిని తరిమికొడతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి త్వరలోనే 500కు గ్యాస్ సిలిండర్ , 200యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభా వేదికగా ప్రకటించి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే ప్రధాని మోడీకి కేసీఆర్ తాకట్టు పెడతారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
Tag:
200 units of free electricity
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండింటిని అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీని కోసం సన్నాహాలు చేస్తున్నామని, ఈ బడ్జెట్ లోనే వాటికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. 500కు గ్యాస్ సిలిండర్,ఇందిరమ్మ ఇళ్లు , 200 యూనిట్ల ఉచిత విద్యుత్ , పదకాల అమలపై మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు. వీటిలో వెంటనే రెండింటిని అమలలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. శాసనసభ సమావేశాల్లోపు మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.




Total views : 80890