తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సుమన్.ఆలయం వెలుపల సుమన్ మీడియాతో మాట్లాడుతూ….. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారన్నారు. మంచి కాంబినేషన్ లో కొత్త ట్విస్ట్తో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి అవకాశం రావడం., జనసేన అధినేత పవన్ అన్ని సీట్లలో క్లీన్ స్వీప్ చేయడం జరిగిందని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సుమన్. వచ్చే ఐదేళ్లలో జరగాల్సిన అభివృద్ధికి పునాదులు వేశారన్నారు. విద్యా., వైద్యం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు. అమెరికా లాంటి క్యాపిటల్ ఏపీకి రావాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. హైదరాబాద్ లాంటి నగరం ప్రపంచ స్థాయి నగరంగా ఎదగడానికి చంద్రబాబే కారణమని గుర్తు చేశారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. అమరావతి కాస్మో పాలిటన్ సిటీగా ఎదగాలన్నారు. తిరుపతి, ఈస్ట్., వెస్ట్ గోదావరిలో ఫిల్మ్ సిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతిని టెంపుల్ సిటీగా డిక్లర్ చేయాలని విజ్ఞప్తి చేశారు
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. సుమారు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న SIR- 2026 కార్యక్రమాన్ని జూన్ 25 నుంచి చేపట్టనున్నారు. ఈ కార్యక్రమ సన్నద్ధతపై రాష్ట్ర సీఈవో సి. సుదర్శన్ రెడ్డి అధికారులతో…
- హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాలలు, కళాశాలలను మాదకద్రవ్య రహిత విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి,…
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- హిమాచల్ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 150461