ఎన్టీఆర్ జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించారు. ఎకరానికి ఆహార పంటకు 50,000 ఉద్యానవన పంటలకు 75000 వాణిజ్య పంటకు లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలి. పంట బీమా వాతావరణ బీమా పథకాలను అమలు చేసి పూర్తిగా నష్టపరిహారం ఇప్పించాలి. ఖరీఫ్ లో బ్యాంకుల నుంచి తీసుకున్న అన్ని రకాల పంట రుణాలను మాఫీ చేయాలి. వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల గురించి పంట నష్టపరిహారం కౌలు రైతులకు ఇవ్వాలి. వేదాద్రి చింతలపూడి లాంటి చిన్న మధ్య తరహా ఎత్తిపోతల పథకాన్ని అన్ని అన్నింటికీ నిధులు కేటాయించి పూర్తి చేయాలి. నిల్వమున్న పంటలను కాపాడుకోవడానికి పగటిపాడు తొమ్మిది గంటలు కరెంట్ ఇవ్వాలి. రబిలో పంటలు వేయడానికి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. వ్యవసాయ పనులు లేని గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించి రోజుకు 600 చొప్పున సంవత్సరానికి 1200 రోజులు పని కనిపించాలి. రబి పంటలకు అవసరమైన విత్తనాలను ఎరువులను పురుగుమందులను ప్రభుత్వం అందించాలి.
ap politics
మాచర్ల నియోజకవర్గం లో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను పరిశీలించేందుకు తెలుగుదేశం జనసేన లకు చెందిన నిజ నిర్ధారణ కమిటీ ఆదివారం మాచర్లలో పర్యటించుచున్నారు. నిజ నిర్ధారణ కమిటీ పర్యటన నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని వెల్దుర్తిలోని ఆయన నివాసంలో పోలీసులు నిర్బంధించారు. బ్రహ్మారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయటాన్ని తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీ అక్రమాలను బయటపెడుతుంటే ప్రతిపక్షాలను నిర్బంధించటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పలువురు విమర్శిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి, టిడిపి పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరొ సభ్యులు కాలువ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకుల ఆగడాలు, ఆకృత్యాలు రోజురోజుకు హెచ్చు మీరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు బీసీలు బలి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు రోజుల్లో కనేకల్ మండలంలో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. కనేకల్ మండలం గరుడచేడు గ్రామంలో మాజీ ఎంపీపీ రాజగోపాల్ రెడ్డి కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల భూ సర్వేలో జోక్యం చేసుకొని తన అనుచరునికి కొంత భూమిని కట్టబెట్టేందుకు ప్రయత్నం చేయడంతో బాధితుడు సురేష్ ఆత్మహత్య తనకు శరణ్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు పంపిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందన్నారు. అదేవిధంగా జక్కల వాడికి గ్రామ సర్పంచ్ భర్త హనుమంత్ రెడ్డి భూమి ఆక్రమించేందుకు మహిళను కూడా చూడకుండా దౌర్జన్యానికి పాల్పడుతూ విచక్షణ రహితంగా దాడికి చేయడం జరిగిందన్నారు. జగనన్న భూహక్కు భూ రక్షణ రీసర్వే పేరుతో భూముల వాస్తవ హద్దులను అధికారులు మార్చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా వైసిపి నాయకులు కనుసన్నుల్లొ భూముల రి సర్వే జరుగుతుందని విమర్శించారు.
రైల్వే కోడూరు టిడిపి క్యాంప్ కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించిన టిడిపి సాంస్కృతిక విభాగాల శాఖ అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్, వైసిపి పరిపాలన పై వినూత్న రీతిలో విరుచుకుపడ్డారు పంతగాని నరసింహ ప్రసాద్. రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలను మాయ మాటలతో మబ్బి పెడుతున్న వైసిపి ప్రభుత్వం, వైసీపీ ఇస్తున్న వాగ్దానాలను విని విని విసికెత్తిపోయిన ప్రజలు ఐదు సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త పథకాలకు కాగితాలపై జీవోలు అంటూ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్న వైసిపి ప్రభుత్వం అని, 4 నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంటే 215 కోట్ల తో సోమశిల బ్యాక్ వాటర్ రైల్వే కోడూరు నియోజకవర్గానికి తీసుకుని వస్తామని చెప్పి ప్రజల చెవులలో పెద్ద కాలిఫ్లవర్ పెడుతున్నారని పంతగాని నరసింహ ప్రసాద్ రైల్వేకోడూరు వ్యంగీకరించారు. నియోజకవర్గంలో కనీసం 10 ఎకరాలకు కూడా ఆయకట్టు ఇవ్వలేని వైసిపి ప్రభుత్వం సోమశిల బ్యాక్ వాటర్ తో సస్యశ్యామలం చేస్తామనడం విడ్డూరం అన,. ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క చెరువు కైనా మరమ్మత్తులు మొదలు పెట్టారా పూర్తి చేశారా అని ఎద్దేవ చేసారు. చిట్వేలి మండలం ఎల్లంరాజు చెరువు మొండిగట్టు మరమ్మత్తు కు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. దాని పని పూర్తి చేస్తామని మీ హామీలో కూడా ఉందని అయినా ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. పుల్లంపేట మండలంలో నూకనపల్లి, అనాసముద్రం, వత్తలూరు చెరువులకు మరమ్మత్తులు చేయలేదు అయినా కొత్త ప్రాజెక్టులు తెస్తామని ప్రజలను మోసం చేస్తున్న వైసిపి ప్రభుత్వం అని, రైల్వే పనులు, రైల్వే అండర్ బ్రిడ్జి పనులు కు సంబంధించి చేసిన భూమి పూజలు మళ్ళీ మళ్ళీ చేసి ప్రజలను మోసం అని ధ్వజమెత్తారు. మీడియా మిత్రులకు ఇళ్ళ స్థలాలు కేటాయిస్తామని చెప్పి అనేక నిబంధనలతో అడ్డుకుంటున్న వైసిపి ప్రభుత్వం. ఈ విధంగా ప్రజలను అనేక రకాలతో మోసం చేస్తూ ప్రజల చెవుల్లో పూలు పెట్టి మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నదని ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోరని ఇకపై వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని పంతగాని నరసింహ ప్రసాద్ పేర్కొన్నారు.
సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆటో డ్రైవర్లుతో చర్చిoచగా వైసీపీ ప్రభుత్వం లో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో ఆటో డ్రైవర్ల నుండి వెయ్యి రూపాయలు కొట్టేస్తున్నారని ,అధిక డీజిల్ ధరలతో ,రోడ్లు సరిగా లేక ఆటోలు రిపైర్లు రావడంతో కుటుంబ పోషణ గడవడం చాలా కష్టంగా ఉందని వాపోయారు, ఎన్నికల ముందు ఆటో డ్రైవర్ల జీవితాలు మార్చేస్తానన్న జగన్ ఇప్పుడు వాళ్ల పాలిట యముడి లా తయారు అయ్యారని డ్రైవర్లు వాపోయారు. అనంతరం సవితమ్మ మాట్లాడుతూ అసలే అంతంత మాత్రం బతుకులు, నిబంధనల పేరుతో అడుగడుగునా పోలీసుల వేధింపులు,ఆపై జరిమానాలు. పెట్రోలు, డీజిల్ ధర మంటలు నెల తిరిగే సరికి అప్పుల వారి ఒత్తిళ్లు ఇవీ ఆటో, క్యాబ్, ట్రక్కు డ్రైవర్ల కష్టాలు. వారి సంక్షేమాన్ని పట్టించుకునే స్థితిలో ఈ వైసిపి ప్రభుత్వం లేదన్నారు. గ్రామీణ ప్రాతాల్లో కనీసం ఓ కిలోమీటరైనా సరిగా లేని రొడ్లు.! ఆపై పొరపాటున ప్రమాదాలు జరిగినప్పుడు ఆటో డ్రైవర్లపై తీవ్ర భారంతో వారి కుటుంసభ్యులు కోలుకునేందుకు ఏళ్ల వ్యవధి పడుతోందనీ దీనికి తోడు కేసులతో పాటు జరిమానాలు చెల్లించి వాహనాలు నడపాల్సిన పరిస్థితి వస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డ సవితమ్మ. ఈ కార్యక్రమంలో మాధవ నాయుడు, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, గుట్టురు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, నల్లూరు మాజీ సర్పంచ్ గోపాల్, త్రివేంద్ర నాయుడు, బాబుల్ రెడ్డి, సనాఉల్లా బాలాజీ నాయక్, మారుతి ప్రసాద్, వాసుదేవరెడ్డి రాంపురం అంజి, మంజు, గోవిందప్ప, టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గన్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సొంత పార్టీలోనే అసమ్మతి ఎదురవుతోంది. ఇటీవల పిఠాపురం, యు కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలలో పర్యటించిన ఎమ్మెల్యేను ప్రజలు నిలదీశారు. కొత్తపల్లి మండలంలో వైసీపీలోని రెండు వర్గాలు కేసులు పెట్టుకునే పతాక స్థాయికి అసమ్మతి చేరింది. గృహ లబ్ధిదారులకు పట్టాలిచ్చినా స్థలాలు ఎక్కడున్నాయో చూపించలేదని నాగులాపల్లి లో ఎమ్మెల్యేను నిలదీశారు. ఇక్కడ ఎమ్మెల్యే దొరబాబును పరుగులు పెట్టించే వరకు పరిస్థితి దారితీయటంతో అధికారులు సైతం నివ్వెరపోయారు. దీనికి తోడు ఆయన సొంత అల్లుడు జనసేనలో చేరారు. ఈసారి దొరబాబుకు టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం జరుగుతోంది.
అధికార పార్టీ వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శ్రీకాకుళం జల్లా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. సాధారణంగా ఇలాంటి సమావేశాలు, సభలు ఊరికి బయట ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటారు. దానికి విరుద్ధంగా నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్ని, సర్కిల్ను బ్లాక్ చేసేసి మరీ వేదికను ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని తుడ్డలిలో వైసీపీ చేపట్టిన సామాజిక బస్సు యాత్ర అరాచకమే సృష్టించిందని చెప్పవచ్చు. ప్రధాన రహదారిపై స్టేజి వేయటంతో పాలకొండ-రాయఘడ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రెండువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
యువగళం పాదయాత్ర 2.0 అంటూ ప్రకటన వచ్చింది కదా అధికార వైఎస్సార్సీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. పాదయాత్రకు ఊహించని రీతిలో జనం తరలి వస్తున్నారు. మొదట్లో ఈ పాదయాత్రను వైఎస్ఆర్ సీపీ తేలిగ్గా తీసుకోగా, ప్రతి చోటా యువగళంలో కనిపిస్తున్న స్పందన చూసి అధికార పార్టీ నేతలు బాగా కంగారు పడుతున్నారు. అందుకు తగ్గట్లుగా యాత్రకు ఎన్ని అడ్డంకులు వచ్చేలా చేశారో లెక్కేలేదు.ప్రస్తుతం నడుస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో ఆ ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. పైగా యువగళం 2.0 పాదయాత్రలో నారా లోకేశ్ ప్రస్తావించే ప్రధాన అంశం.. చంద్రబాబు అక్రమ అరెస్టు గురించే ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ కక్ష్యసాధింపు తీరును ఈ యాత్ర ద్వారా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తారు. జనాదరణ కూడా గతంలో కంటే మరింతగా ఉంటుంది. ఈ పరిణామాలు ఊహించుకొనే ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీ నేతలు టెన్షన్ పడుతున్నట్లుగా సమాచారం. యువగళం సాగే ప్రాంతాల్లోని నేతలకు దానికి అడ్డంకులు సృష్టించాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందాయని కూడా సమాచారం
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ లబ్ధి కొరకు నాపై నిందలు వేస్తున్నాడని తాడిపత్రి మున్సిపల్ మాజీ చైర్మన్ జాన్సన్ అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సివిల్ సప్లై స్టాక్ పాయింట్లో నేను అక్రమాలకు పాల్పడుతున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించడం సిగ్గుచేటన్నారు. అవినీతి, అక్రమాలకు ఎవరు పాల్పడుతున్నారో తాడిపత్రి ప్రజలందరికీ తెలుసన్నారు. ఎవరు నిజాయితీపరులో నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతలప్రదేశ్ గా మారిందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు. టీడీపీ-జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. గండేపల్లి మండలం కోరుకొండ, గోకవరం మండలాలకు అతి ముఖ్యమైన లింకు రోడ్డు అద్వాన్న పరిస్థితిలో ఉంది. వెంటనే మరమ్మతులు చేసి ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని రోడ్లను వెంటనే బాగు చేస్తామని నెహ్రూ తెలిపారు.





Total views : 91090