ప్రధాని నరేంద్ర మోదీ ఒక విజనరీ లీడర్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. తక్షణ సవాళ్లను అధిగమించగల సామర్థ్యం కలిగిన వారని అన్నారు. దేశాన్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించే శక్తి కలవారని, వివిధ రంగాల్లో పరివర్తనాత్మక మార్పును తీసుకురాగలరని చెప్పారు. దేశాన్ని ఐక్యంగా ఉంచగల సమర్థులు అని అన్నారు. మోదీ విజన్ 2047 సాకారమయ్యేందుకు బీజేపీకి, ప్రధానికి జనసేన పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. రెండు పార్టీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. జనసేనకు బీజేపీ 8 స్థానాలకు కేటాయించింది. తమ అభ్యర్థులకు పవన్ కల్యాణ్ బీఫామ్ లను కూడా అందించారు.
Bjp
ఐదు సంవత్సరాలు మీ కోసం పనిచేశానని, అభివృద్ధిని చూసి తనకు మార్కులు వేయాలని మంత్రి హరీష్ రావు కోరారు..సిద్దిపేట అభివృద్ధి కోసం కష్టపడ్డానని,ఎన్నికల సమయం లో హడావుడి చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హరీష్ రావు కోరారు. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న నాకు మీరు ఓట్ల రూపంలో మార్పులు వేసి దీవించాలని ఆయన కోరారు..
సిద్దిపేట జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణారెడ్డి 50 మంది మహిళా కార్యకర్తల్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు..
నల్గొండ జిల్లా చండూర్ లో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 2018 ఎన్నికల్లో కమ్యూనిస్టుల పొత్తు వల్లే ఎమ్మెల్యే గా గెలిచిన. కేసీఆర్ గద్దె దింపడం బీజేపీ పార్టీ మోడీ నాయకత్వంతో సాధ్యం అనే నమ్మకం తో పార్టీ మరీనా. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేతిలో పెట్టుకొని లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్టు చేయకపోవడం దారుణం. రాష్ట్రంలో బిజెపి బీఆర్ఎస్ఒ కటయ్యాయి. నా లక్ష్యం కేసీఆర్ ను గద్దె దింపడమే, అది బీజేపీ తో సాధ్యం కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి విస్తుంది,కేసీఆర్ గద్దె దింపడం కాంగ్రెస్ తోనే సాధ్యమని తిరిగి సొంత పార్టీకి వచ్చిన. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల వల్లే బిఅర్ఏస్ గెలిచింది. పేదల పార్టీ ,ఆత్మగౌరవం తో పని చేసే నాయకులు కమ్యూనిస్టులు. ఉప ఎన్నికల్లో మీ లక్ష్యం బీజేపీ ఓటమి, రాజగోపల్ రెడ్డి మీద శత్రుత్వం కాదని తెలిసిపోయింది.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన ఓయూ జెఎసి వ్యవస్థాపక సభ్యులు ప్రధానమంత్రి మోడీ బిసి అభ్యర్థిని సీఎం చేస్తామని ప్రకటించడం తో మునుగోడు బిజెపి పార్టీ అభ్యర్థి చలమల కృష్ణారెడ్డికి మద్దతు తెలుపుతున్నామని ప్రకటించిన ఎనగంటి రాజు నేత ఈ కార్యక్రమంలో ఓయూ జెఏసి వ్యవస్థాపక సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ 75 సంవత్సరాలలో ఏ ఒక్క పార్టీ కూడా బీసీ అభ్యర్థులను సీఎం చేస్తానని ప్రకటించలేదు. బిజెపి పార్టీ మాత్రం తెలంగాణలో 80 శాతం ఉన్న 136 ఉపకులాల బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మునుగోడులో బిజెపికి మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. ఒక కెసిఆర్ వంద అబద్దాల పేరుతో కరపత్రాలు తయారు చేసి ప్రచారం నిర్వహిస్తున్నామని తొమ్మిది సంవత్సరాలుగా కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను యువతను మోసం చేస్తూనే ఉంది ఏ యొక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తున్నారు బిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో నిరుఉద్యోగులు, యువత కోసం ఏ ఒక్క హామీ లేదు యువత ఏ ఒక్కరు కూడా బారాస కు ఓటేయొద్దని తెలిపిన ఓయూ వ్యవస్థాప సభ్యుడు రాజు నేత తెలిపారు.
Read Also..
ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖని సీతానగర్ కూరగాయల మార్కేట్ లో రామగుండం నియోజక వర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులను వినియోగదారులను కలిసి బిజెపికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సంధ్యారాణి కోరారు. అనంతరం బిజెపి అభ్యర్థి సంధ్యారాణి మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యంతో కూరగాయల మార్కెట్ అసాంఘిక కార్యకలాపాలకు నీలయంగా మారిందని విమర్శించారు. వర్షాకాలంలో రైతులు కూరగాయలను నిల్వ చేసుకోవడానికి కనీస సౌకర్యాలను కల్పించడంలో నాయకులు విఫలమయ్యారని విమర్శించారు. రామగుండంలో బిజెపి పార్టీని గెలిపిస్తే…గెలిచిన నెల రోజుల్లో సుందరీకరణ తీర్చిదిద్ది ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు విరామం తీసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు కూరగాయలు నిల్వ చేసుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తామన్నారు. కూరగాయల మార్కెట్ భువన సముదాయం కోసం కోట్ల రూపాయలు వేచించి నాయకులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. సామాన్య మహిళగా రామగుండం నియోజకవర్గంలో బిజెపి పార్టీకి ఓటు వేసి ఒక అవకాశం ఇవ్వాలని, ప్రత్యేక మెజార్టీతో గెలిపించాలని కందుల సంధ్యారాణి వారిని కోరారు.
సికింద్రాబాద్ లో బిజెపి పార్టీ రెబల్ అభ్యర్థి. బండపల్లి సతీష్ గౌడ్ .సికింద్రాబాద్ నియోజకవర్గము బిజెపి నాయకుడు బండపల్లి సతీష్ గౌడ్ బిజెపి పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలబడనున్నాడు. సికింద్రాబాద్ లో బిజెపి పార్టీకి గత 10 సంవత్సరాల నుండి కష్టపడి పని చేశాను. గత ఎలక్షన్ లో సికింద్రాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పద్మారావు గౌడ్ పై ఓడిపోయాను. గడిచిన పదేళ్లలో సికింద్రాబాద్ ప్రజలతో మమేకమై ప్రజలకు సేవలు చేస్తున్నాన న్నారు. సికింద్రాబాద్ లో బూతు స్థాయి కార్యకర్తలు, నాయకులను కలుపుకొని పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. కష్టపడి పనిచేసిన వారికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కృష్ణారెడ్డి కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదన్నారు.ఎన్నోసార్లు ఫోన్ చేసిన ఇప్పటివరకు ఫోన్ కూడా ఎత్తకుండా సమాధానం కూడ ఇవ్వలేదన్నారు.సికింద్రాబాద్ నియోజకవర్గం సర్వేలో మొదటి వరుసలో నా పేరు ఉందని అన్నారు. సర్వేలో జీరో స్థానంలో ఉన్న మేకల సారంగపానికి టికెట్ ఎలా ఇస్తారన్నారు. ఇప్పుడు కూడ బిజెపి పార్టీ సిద్ధాంతాలతో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తూ సికింద్రాబాద్ నుండి బిజెపి పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని సతీష్ తెలిపారు.ఇప్పుడు కూడ బిజెపి పార్టీ కి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధినాయకత్వం ఆలోచించి నాకు బిజెపి పార్టీ టికెట్ ఇస్తే పద్మారావు గౌడ్ మీద గెలిచి కేంద్రానికి కానుక గా ఇస్తానన్నారు.సికింద్రాబాద్ తో పాటు బండారు దత్తాత్రేయ కూతురు కూడా టికెట్ ఇవ్వకపోవడానికి వెనకాల ఉన్న రహస్యం ఎంటన్నారు? ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటున్నాను.ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నానని సతీష్ మీడియా తో మాట్లాడారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహిళలకు క్షమాపణ చెప్పారు. అసెంబ్లీలో తన స్పీచ్ పై ఆయన బుధవారం మీడియా ముందు స్పందించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎవరినీ కించపరచాలని అనుకోలేదని, సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను చెప్పే క్రమంలో అలా మాట్లాడానని వివరించారు. ఏదేమైనా తన స్పీచ్ తో బాధపడిన మహిళలకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్ స్పీచ్ పై ప్రతిపక్ష బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. నితీశ్ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనపై నితీశ్ కుమార్ స్పందిస్తూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల అభ్యంతరాలపై మీడియా ముందే వివరణ ఇచ్చినట్లు తెలిపారు. నితీశ్ కుమార్ స్పీచ్ చూసి ఇలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి అయినందుకు సిగ్గుపడుతున్నామని బీజేపీ నేతలు విమర్శించారు. అసెంబ్లీలో ఆయన మాటలు విన్న వారందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితని మండిపడ్డారు. నితీశ్ మైండ్ పనిచేయడంలేదని, ఆయన స్టేట్ మెంట్ మరీ థర్డ్ గ్రేడ్ గా ఉందని విమర్శించారు.
వైకాపా నాయకులు అవినీతి అక్రమాకేసులు ఎదుర్కొంటూ దెయ్యాలు వేదాలు వర్లిచ్చినట్టు ఉంది వైకాపా నేతల తీరు బిజెపి అధ్యక్షులు పరందేశ్వరిపై వైకాపా నాయకుల విమర్శలు పై ఆమె స్పందించారు. జగన్ వైకాపా పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ పెట్టింది పేరు అని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఇసుక అటవీ సంపదను దోచుకుంటున్నారని తెలిపారు. కరెంట్ బిల్లు చెత్త మున్సిపల్ పన్నులు వేసి ప్రజలను నడ్డి విరుస్తున్నారు. వైకాపా నాయకులు ఇద్దరు A 1. A 2 జగన్మోహన్ రెడ్డి విజయ సాయి రెడ్డిని ఉద్దేశించి 10 సంవత్సరాల నుంచి తాత్కాలిక బెయిల్ పై ఉండటం ఎక్కడా లేదు అని తెలిపారు. ఇలాంటి అవినీతిపరులు విజయ్ సాయి రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి మీరా మా అధ్యక్షురాలు న విమర్శిస్తారా.. రాష్ట్రంలో జరిగిన మీ అవినీతిని ఆధారాలతో బయట పెట్టినందుకు మా అధ్యక్షులను విమర్శిస్తారని తెలుపుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి గారి ఆదేశాలతో రాష్ట్రంలో బిజెపి అధికారంలో వచ్చే అంతవరకు ప్రజా సమస్యలపై పోరాడుదాం తెలిపారు.
టికెట్లు అమ్ముకునే సంస్కృతి ఉన్న కాంగ్రెస్పార్టీ రేపు రాష్ట్రాన్ని అమ్ముకోదన్న గ్యారంటీ ఏంటని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఆందోల్ మండల పరిధిలోని సంగుపేట వద్ద జరిగిన బూత్ కమిటీల సమావేశానికి హాజరై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్తో కలిసి మాట్లాడారు. కాంగ్రెసోళ్లకు ప్రజలు పదకొండు సార్లు అవకాశమిస్తే ఏం డెవలప్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సంగారెడ్డిని జిల్లా చేయలేదు, తలాపున ఉన్న సింగూర్ నుంచి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థులన్నారు. ఆందోల్ కాంగ్రెస్ పెద్ద లీడర్ వాళ్లకు, వీళ్లకు టికెట్ ఇప్పిస్తానని మాటిచ్చి ఇప్పుడు భంగపడ్డారని విమర్శించారు. తెలంగాణ సాధించి అభివృద్ధి వైపు నడిపిస్తున్న కేసీఆర్ను వదులుకుంటే తెలంగాణ ప్రజలు ఆగమవుతారన్నారు. కేసీఆర్ను గెలిపించుకుటేనే భవిష్యత్ ఉంటుందన్నారు. తల్లి లాంటి బీఆర్ఎస్ను ప్రజల నుంచి దూరం చేయడానికి కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్నారు. కార్యకర్తలు ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో జనసేన పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి ముందుకు సాగుతున్నాయి. జనసేనకు బీజేపీ ఇప్పటికే 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా ప్రస్తుతానికి ఎనిమిది స్థానాలను బీజేపీ కేటాయించింది. మరికొన్ని స్థానాలపై చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది. కూకట్పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు నుండి నేమూరి శంకర్ గౌడ్, కోదాడ నుండి మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు నుండి వంగ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం నుండి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం నుండి లక్కినేని సురేందర్ రావు, వైరా నుండి డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావుపేట నుండి ముయబోయిన ఉమాదేవి పోటీ చేయనున్నారు.





Total views : 90323