టీడీపీ జనసేన కూటమికి ప్రజలు మద్దతు తెలిపి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని నర్సాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ కోరారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును ప్రజలకు వివరించారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఆయన కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారని ఏటువంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా ఇరు పార్టీ నాయకులు కూటమి గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: పాదయాత్రతో శ్రీశైలానికి వేలాదిగా తరలివస్తున్న భక్తులు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 80898