టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మూడురోజుల పర్యటన ఖరారయ్యింది. 28వ తేదీ హైదరాబాద్ నుండి బెంగళూరు చేరుకొని అక్కడ కాడుగుడి హాస్పిటల్ నందు అనారోగ్యంతో ఉన్న కుప్పం మున్సిపల్ టీడీపీ నాయకుడు త్రిలోక్ ని పరామర్శిస్తారు. అక్కడి నుండి రోడ్డుమర్గంలో గుడుపల్లి చేరుకొని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం కుప్పం పార్టీ కార్యాలయానికి చేరుకొని పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న తన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ఇంటికి వెళ్లి పరామర్శించిన అనంతరం స్థానిక R&B అతిధి గృహంలో బస చేయనున్నారు. రెండో రోజు ఉదయం 9గంటలకు R&B అతిధి గృహం వద్ద ప్రజలనుండి వినతులు స్వీకరిస్తారు .11.50గంటలకు శాంతిపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద భాహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడినుండి రామకుప్పం కి చేరుకొని పోలీస్ స్టేషన్ సర్కిల్ లో సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుండి కుప్పం బైపాస్ రోడ్డులోని mm మహల్ కి చేరుకొని పార్టీ నాయకులతో సమావేశం అవుతారు అక్కడినుండి మండల వారీగా కుప్పం లోని BCN కల్యాణ మండపనికి చేరుకొని సమీక్ష నిర్వహిస్తారు. సమావేశం ముగిసినతరువాత రాత్రికి R&B అతిథి గృహానికి చేరుకొని బస చేస్తారు. 30వ తేదీ ఉదయం ప్రజలనుండి వినతులు స్వీకరిస్తారు అనంతరం 12గంటలకు pes మెడికల్ కాలేజీ వద్ద కురభ భవనం వద్ద శ్రీ కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు అనంతరం కురభ కులస్థులతో సమావేశం అవుతారు. అక్కడినుండి మధ్యాహ్నం 2.30 కి కుప్పం బస్ట్ స్టాండ్ లోని అన్నా కాంటీన్ లో పేదలకు అన్నదానం చేస్తారు అక్కడినుండి కొత్తపేట ఉన్న పెద్దపల్లి గంగమ్మ ఆలయానికి వెళ్లి పూజలు చేసిన అనంతరం మజీద్ కు పెళ్లి ప్రతేక ప్రార్థనలు చేస్తారు. అక్కడినుండి మాల్లనూరు బస్సు స్టాండ్ వద్దకి చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉదేశించి మాట్లాడతారు అనంతరం అక్కడినుండి రోడ్డుమర్గంలో బెంగళూరు HAL ఎయిర్పోర్ట్ కి చేరుకొని హైదరాబాదుకు వెళ్తారు.
CBN
చిత్తూరు జిల్లా కుప్పం, నారా చంద్రబాబు నాయుడి కుప్పం పర్యటన పై మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. చంద్రబాబు రాక కోసం కుప్పం ప్రజలు ఎదురుచూస్తున్నారు అని, ఈ నెల 28,29,30 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఖరారు. నాలుగు మండలాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. నాలుగు మండలాల్లో బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. చంద్రబాబు కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
శ్రీవారి దర్శించుకున్న చంద్రబాబు మాట్లాడుతూ పాద పద్మాల చెంత పుట్టి అంచెలు అంచెలుగా ఏదిగా. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారు నన్ను కాపాడారు. కష్టం వచ్చినప్పుడు స్వామి వారిని మొక్కకున్నా. ధర్మాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్ధించా. మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల కు వచ్చి దర్శనం చేసుకున్నా. భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి..తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలి. ప్రజలకు సేవ చేసే శక్తీ,సామర్థ్యలు ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నాను. త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తా అని చంద్రబాబు అన్నారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం నిన్న సాయంత్రం రేణిగుంట చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో రేణిగుంట వచ్చారు. రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. చంద్రబాబు రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేసి, ఈ ఉదయం సతీసమేతంగా చంద్రబాబునాయుడు వెంకటేశ్వరస్వామి దర్శనం.
అమరావతి ఈ నెల 27 నుంచి యువగళం పాదయాత్ర పునఃప్రారంభం కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో యాత్ర షురూ. ఇచ్చాపురం కాకుండా విశాఖలో ముగియనున్న పాదయాత్ర. గతంలో తన యాత్రను విశాఖలోనే ముగించిన చంద్రబాబు. అదే సెంటిమెంట్ తో విశాఖలోనే ముగించాలనుకుంటున్న లోకేశ్. ఈ ఏడాది జనవరిలో యువగళం పాదయాత్ర ప్రారంభం. ప్రజల సమస్యల్ని స్వయంగా అడిగితెలుసుకున్న నారా లోకేశ్. పాదయాత్రలో హామీలిస్తూ ప్రజలకు భరోసా కల్పించిన యువనేత.
నారా లోకేష్ నవంబర్ 24 నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టుతో యువగళం పాదయాత్ర ఆగిపోయింది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇప్పటివరకు మొత్తం 2852.4 కిలోమీటర్ల దూరం నడిచారు. 208వ రోజు పొదలాడ, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం, కోనసీమ జిల్లా వద్ద పాదయాత్ర ఆగి పోయింది. అయితే పాదయాత్రను ముందుగా అనుకున్న ఇచ్ఛాపురం వరకు కాకుండా విశాఖలోనే ముగించే ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర విశాఖలోనే ముగించిన నేపథ్యంలో టీడీపీ విశాఖనే సెంటిమెంట్ గా భావిస్తోంది. దీంతో విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడితో పాదయాత్ర ముగించాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో విశాఖ వరకే చేయాలని నారా లోకేష్ అనుకుంటున్నట్లుగా సమాచారం.
అమరావతి నేడు ఢిల్లీ కి టీడీపీ నేతల బృందం. ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఢిల్లీలో రేపు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేతలు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లనున్న యనమల, నిమ్మల రామానాయుడు, బోండా ఉమా, పయ్యావుల కేశవ్ బృందం
అధికార పార్టీ ఒత్తిడితో ఓటరు లిస్ట్ లో జరుగుతున్న అక్రమాలపై ఆధారాలతో ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేతలు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడంతో బిగ్ రిలీఫ్, AP, తెలంగాణలో పాలాభిషేకాలు చేస్తూ శ్రేణుల సంబరాలు స్కిల్ కేసులో బాబుపై ఆరోపణలే తప్ప.. ఆధారాల్లేవ్ అన్న న్యాయస్థానం 149 సాక్షులు, 4వేల పేజీల డాక్యుమెంట్లు అంతా తుస్సని తేల్చిన హైకోర్టు సత్యం గెలిచింది.. అసత్యంపై యుద్ధం మొదలైందన్న లోకేశ్ ఇక ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత, యువనేత ఇంకా చాలా కేసులు ఉన్నాయంటూ కడుపు ఉబ్బరం బయటపెట్టిన సజ్జల చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే తమకు జింతాత..జింతాతే..అంటూ వైసీపీలో టెన్షన్.
వైసీపీ అక్రమాలపై టిడిపి నాయకులు తిరుపతి కలెక్టర్ ను కలిశారు.
భూకబ్జాలు, అక్రమ మైన్స్, దొంగ ఓట్ల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి టిడిపి నాయకులు
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీసుకెళ్లారు.వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులకు… ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు చేశారు.కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. వైసిపి నేతల అక్రమాలపై ఆందోళనలు చేస్తున్న టిడిపి నేతలపై అక్రమ కేసులను పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేల దొంగ ఓటర్లను సృష్టించడమే కాకుండా….చనిపోయిన వారి ఓట్లను తీసివేయకుండా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ 15 రోజుల్లో స్పందించకుంటే… న్యాయస్థానాన్ని ఆశ్రయించి…వైసిపి నేతలు అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని ప్రజలు ముందు పెడతామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
అమరావతి….
నేడు జనసేన,టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది, నేటి మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న సమావేశం లో టీడీపీ నుంచి ముగ్గురు,జనసేన నుంచి ముగ్గురు సభ్యులు పాల్గొననున్నారు. టీడీపీ నుంచి కమిటీలో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి మరియు జనసేన నుంచి కమిటీలు సభ్యులుగా నాదెండ్ల మనోహర్ ముత్తా శశిధర్, శరత్ కుమార్ హాజరుకానున్నారు.
నేటి మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నది. ఇప్పటికే ఆరు అంశాలను మినీ మేనిఫెస్టో గా విడుదల చేసిన టీడీపీ, మరో ఐదు లేక నాలుగు అంశాలను చేర్చాలని జనసేన వెల్లడి. ఇరువురి ప్రతిపాదనలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం..




Total views : 223743