అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె రాబోయే 2024 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యం అంటున్న జయచంద్ర రెడ్డి. పి.టీ.ఎం మండలం లో ఎలక్షన్ల హడావిడి నెలకొంది ప్రచారంలో తెలుగుదేశం పార్టీ తరఫున ముందున్న జయ చంద్రారెడ్డి. తంబళ్లపల్లి నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యం అంటున్న జయచంద్రారెడ్డి. నియోజకవర్గంలోని పెద్దతిప్ప సముద్రం మండలంలోని పలు గ్రామాలలో విస్తృత పర్యటన చేసిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త దాసిరిపల్లి జయచంద్ర రెడ్డి మండలంలోని టీ.సదుం పంచాయతీ పాపాగ్ని నది ఒడ్డున వెలసిన సంగమేశ్వర స్వామి ఆలయంలో , చెన్నారాయనపల్లి వద్ద ఉన్న చౌడేశ్వరి దేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం టి.సదుం పంచాయతీ నవాబు కోట,బెట్టకొండ, గ్రామాల్లో పర్యటించి ఎన్నికల పరిచయ కార్యక్రమాల్లో ముందున్న జయచంద్ర రెడ్డి. అనంతరం జయచంద్రారెడ్డి మాట్లాడుతూ తంబళ్ళపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వంతోనే సుసాధ్యతమని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్ అండ్ బి రోడ్లను వేయకుండా గతంలో నిధులు మంజూరు చేసిన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రోడ్లను వేసి మేమే అభివృద్ధి చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదమని తెలిపిన జయచంద్ర రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడారును ఏర్పాటు చేసి యువతకు ఉపాధి చేకూర్చాలని తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న జయ చంద్రారెడ్డి.
CVr health
విజయవాడ, డీఆర్ఎం విజయవాడ రైల్వే డివిజన్ గోదావరి ఎక్స్ప్రెస్ కు 50 సంవత్సరాలు నిండటంతో రాత్రికి 11గంటలకు గోదావరి ఎక్స్ప్రెస్ వద్ద సంబరాలు. గోదావరి ఎక్సప్రెస్ వెళ్ళే అన్ని ప్రధాన స్టేషన్లలో సంబరాలు. గోదావరి ఎక్సప్రెస్ ఒక సెంటిమెంట్ కొందరు ప్యాసింజర్లకు విజయవాడ మధురానగర్ అండర్ పాస్ కు అప్రోచ్ రోడ్డు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వాల్సి ఉంది. నాలుగు లైన్లను అభివృద్ధి చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఏపీకి గణనీయమైన రైల్వే బడ్జెట్ ను ఈ సారి ఏర్పాటు చేసింది కేంద్రం.
విజయనగరం జిల్లా, కొత్తవలసలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి. కొత్తవలస మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గురువారం కొత్తవలస మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు & టీడీపీ బీసీ సెల్ ముఖ్య నాయకులతో కలిసి శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గారు మాట్లాడుతూ బీసీలను అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని, అందుకు వారందరినీ ఏకం చేయడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేయడానికి తెలుగుదేశం పార్టీ ఈ జయహో బీసీ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. బీసీలకు వెన్నుదన్నుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు ఉంటారని, వారి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, ఆదరణ పథకాలు, బీసీ కార్పొరేషన్ రుణాలు, సబ్ ప్లాన్ నిధులు, బీసీ భవనాలు, విదేశీ విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఎన్టీఆర్ విద్యోన్నతి, బీసీ కులగణన, నామినేటెడ్ పదవులు వంటి అన్ని అవకాశాలు దక్కుతాయని అన్నారు. అంతేకాకుండా విద్యార్థి, విద్యార్థులకు విద్యారంగంలోనూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సామాజిక ఎదుగుదల, బలహీన బడుగు వర్గాలన్నీటికి రాజకీయ పురోభివృద్ధి, ఆర్థిక ఎదుగుదల వంటివి కూడా ఉంటుందని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం గోకవరం లో ఆసక్తికరం గా మారిన వైసీపీ నేతల వరుస ఆత్మీయ సమావేశాలు. జగ్గంపేట కొత్త ఇంచార్జ్ గా తోట నరసింహం వచ్చాక, స్థానిక వైసీపీ నేతలతో సమన్వయం లేకపోవడంతో కేడర్ లో అసహనం వ్యక్తం చేస్తున్న నేతలు. మరో పక్క నియోజకవర్గం లో రోజు రోజుకు టీడీపీ లోకి పార్టీ కండువాలతో తమ వైపు మార్చుకుంటున్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. వైసీపీ ఇంచార్జ్ గా తోట నరసింహం వచ్చినప్పటికీ టీడీపీ లోకి కేడర్ మారిపోతుండడంతో ఏమి చేయాలో తెలియక తికమక పడుతున్నామంతున్న నియోజకవర్గ వైసీపీ నేతలు. మరోపక్క ఎమ్మెల్యే గా ఉన్న జ్యోతుల చంటిబాబు కు మళ్ళీ వైసీపీ లో ఇంటిలిజెన్స్ వర్గాల రిపోర్ట్ ల ద్వారా మళ్ళీ అవకాశాలు ఉన్నాయని వస్తున్న వార్తలతో చంటిబాబు అనుచరుల్లో నూతన ఉత్సాహంగా కలిసి పనిచేస్తామంటున్న స్థానిక నేతలు. నియోజకవర్గ పరిధిలోని మండల కేడర్ నేతలతో ఆత్మీయ సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడంతో అనూహ్య గా మారుతున్న రాజకీయం. చంటిబాబు కు మళ్ళీ అవకాశాలు ఉన్నాయని పుకార్లు తో వైసీపీ లో ఇంచార్జ్ గా ఉన్న నేతల మధ్య, టిడిపి నేతలు మధ్య మొదలైన గుబులు. గోకవరం లో స్థానిక జడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్ నివాసం వద్ద తన అనుచరులతో చంటిబాబు వర్గం కార్యకర్తలు తో అత్యవసర భేటి.
మునగాకు నీరు ఒక అద్భుతమైన ఆరోగ్య పానీయం. ఇది పోషకాలతో నిండి ఉంటుంది మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగాకు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు…
మునగాకు నీరు విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మునగాకు నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మునగాకు నీరు జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది, ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది. మునగాకు నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. మునగాకు నీరు ఐరన్కు మంచి మూలం. ఇది రక్తహీనత రాకుండా చేస్తుంది. మునగాకు నీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచివి.
మునగాకు నీళ్ళు ఎలా తయారు చేయాలి:
- ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ మునగాకు పొడి వేసి మరిగించాలి.
- మరిగిన తర్వాత వడకట్టి, చల్లబడిన తర్వాత తాగాలి.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మండలం ఆకునూరు లో వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ది పొందిన 3296 మందికి రూ.3.12 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి జోగి రమేష్. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆసరా ను మహిళలు పండగలా జరుపుకుంటున్నారు. జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. అవ్వా తాతలకు గడప వద్దకే పెన్షన్ అందిస్తున్నాం. 2019 లో ఇచ్చిన అన్ని హామీలు జగన్ అమలు చేశారు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి .. కట్టిస్తున్నాం. జగన్ చెప్పాడంటే… చేస్తాడంతే.. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారాయి. విద్య కు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మరు. ఎన్టీఆర్ ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని అన్నారు.
ఆధునిక పరికరాల సహాయంతో అమెజాన్ అడవిలో 2,000 సంవత్సరాల నాటి ఒక పురాతన నాగరికత యొక్క ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ నాగరికత చాలా అధునాతనమైనదిగా భావిస్తున్నారు. పెద్ద పెద్ద నగరాలు, రోడ్లు, నీటిపారుదల వ్యవస్థలు ఉన్నట్లు ఆధారాలు కనుగొనబడ్డాయి.
ఈ నాగరికతకు చెందిన ప్రజల గురించి మనకు చాలా తక్కువగా తెలుసు. వారి మూలాలు, భాష, సంస్కృతి ఇంకా తెలియని విషయాలే. ఈ నాగరికత ఎక్కడికి పోయింది, ఎందుకు అంతర్థానమైంది అనేది కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది.
ఈ ఆవిష్కరణ చాలా ముఖ్యమైనది ఎందుకంటే, ఇది అమెజాన్ అడవి చరిత్ర గురించి ఇంకా లోతుగా తెలియపరుస్తుంది. దక్షిణ అమెరికాలో ఇంకా ఎన్నో అన్వేషించబడని పురాతన నాగరికతలు ఉండవచ్చని ఈ ఆవిష్కరణ ఊహాగానాలకు తావిస్తోంది. ఈ నాగరికత గురించి మరింత తెలుసుకోవడానికి పరిశోధకులకు ఒక కొత్త దిశను చూపిస్తుంది. శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పరిశోధనలకు దారితీస్తుందని భావిస్తున్నారు.
మీ వేలు గోర్లు చిన్నవిగా కనిపించవచ్చు, కానీ అవి 32 రకాల బ్యాక్టీరియాలను కలిగి ఉంటుంది. ఈ బ్యాక్టీరియాల నుండి విముక్తి పొందాలనుకుంటున్నారా..? చింతించకండి, చాలా బ్యాక్టీరియాలు హానిచేయవు. కానీ కొన్ని ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. కాబట్టి మీ గోర్లను శుభ్రంగా ఉంచడం ముఖ్యం!
గోర్లను శుభ్రంగా ఉంచే కొన్ని చిట్కాలు :
- తరచుగా మీ చేతులు కడుక్కోండి. ముఖ్యంగా బాత్రూమ్ని ఉపయోగించిన తర్వాత, తినడానికి ముందు మరియు మురికిగా ఉన్నవస్తువు ఏదైనా తాకిన తర్వాత చేతులు కడుక్కోండి. మీ గోళ్లను శుభ్రంగా ఉంచండి.
- గోళ్ల బ్రష్తో వాటిని స్క్రబ్ చేయండి మరియు సబ్బు మరియు నీటితో కడిగి గోళ్లను శుభ్రం చేయండి. మీ గోళ్లను కొరకకండి. ఇది బ్యాక్టీరియాను మీ నోటిలోకి తీసుకువెళుతుంది.
- మీ గోళ్ల కింద చర్మం చిట్లకుండా జాగ్రత్త వహించండి. ఇది బ్యాక్టీరియా ప్రవేశించడానికి మార్గాన్ని సృష్టిస్తుంది. మీకు గోళ్ల ఇన్ఫెక్షన్ ఉంటే, వైద్యుడిని సంప్రదించండి. కానీ చింతించకండి, మీ గోర్లను శుభ్రంగా ఉంచడం ద్వారా, మీరు చాలా ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. కాబట్టి వెంటనే మీ గోర్లను స్క్రబ్ చేయండి!
శస్త్ర చికిత్సల ప్యాకేజీల పెంపు, బకాయి బిల్లుల చెల్లింపు, ఆస్పత్రులు – ట్రస్ట్ మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మెకు దిగాయి. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల యాజమాన్య సంఘం తెలిపింది. ప్రస్తుతం అడ్మిషన్లలో ఉన్న రోగులకు యథావిధిగా సేవలు కొనసాగనున్నాయని, కొత్త రోగులను చేర్చుకోబోమని తెలిపాయి. నిజానికి గత ఏడాది డిసెంబరు 29 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. అయితే ప్రభుత్వం చర్చలకు పిలవడంతో సమ్మెను విరమించుకున్నారు. అయితే హామీ మేరకు ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చలేదంటూ మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు.
కరీంనగర్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కేటీఆర్ పై విమర్శలు కురిపించారు. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నడు…అదే అహంకారం కన్పిస్తోంది. కేసీఆర్ పాలనలోని అరాచకాలను, అవినీతిని బయటపెట్టిందే బీజేపీ అంటు విమర్శించారు. అందుకే జనం ఆ పార్టీని బొందపెట్టారని, అయినా సిగ్గు లేకుండా అరువు జిల్లా నేతను తీసుకొచ్చి మొరుగుతున్నడు అని అన్నారు. బండి సంజయ్ ఏం చేసిండో కేసీఆర్ ను రమ్మను చర్చించేందుకు సిద్ధం అన్నారు. నువ్వెన్ని మొరిగినా నీ కుటుంబ గుత్తాధిపత్యాన్ని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అయన తెలిపారు.
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానమే…బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదు. ఇక్కడున్న సోకాల్డ్ మేధావి వినోద్ కుమార్ టిప్పర్ దరఖాస్తులు పంపిండు తప్ప ఒక్క పని చేయలేదు. కేసీఆర్ కుటుంబానికి ఆయన ఉపయోగపడ్డారే తప్ప కరీంనగర్ కు చేసిందేమీ లేదని బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్.. జగిత్యాల, వరంగల్ జాతీయ రహదారి పనులకు నిధులు తెచ్చిందెవరు? అంటూ ప్రశ్నించారు. ఆయన ఎంపీగా ఉన్నన్నాళ్లు కరీంనగర్…వరంగల్ రోడ్డు అధ్వాన్నంగా ఉండేవి… యాక్సిడెంట్స్ అవుతుంటే ఎన్నడైనా నిధులు తెచ్చినవా? నేను ఎంపీగా ఉంటూ కేంద్రంతో మాట్లాడి రిపేర్లకు రూ.41 కోట్లు తెచ్చిన అంటూ ఫేర్ అయ్యారు. ఈనెల 28న ఎస్సారార్ కాలేజీలో వేలాది మంది బీజేపీ కార్యకర్తలతో సమ్మేళనం నిర్వహించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ కర్యక్రమానికి రానున్నారు. సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపు నిచ్చారు.




Total views : 141693