చలో అమరావతి అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించడానికి వెళ్తున్న అంగన్వాడీలను పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రైల్వే స్టేషన్ లో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. మేము ఏమి తప్పు చేశామని శాంతియుతంగా వెళ్తున్న మమ్మల్ని అన్యాయంగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారని అంగన్వాడీలు మండిపడ్డారు. గత 40 రోజులుగా సమ్మె చేస్తున్న మమ్మల్ని పట్టించుకోని ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మమ్మల్ని అన్యాయంగా రోడ్డుపాలు చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు కూడా వచ్చేలా చేశారని వారు అన్నారు. మాకు వచ్చే 11500 జీతంతో ఏ కుటుంబమైన గడుస్తోందన అని, మమ్మల్ని ఇక్కడ ఆపినంత మాత్రాన ఉద్యమం ఆగదని కచ్చితంగా ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని అన్నారు.
cvr live
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కబడ్డీ స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పురుషుల విభాగంలో విన్నర్ గా హర్యానా, రన్నర్ గా రాజస్థాన్, మూడు నాలుగు స్థానాల్లో ఆంధ్ర, వెస్ట్ బెంగాల్ జట్టు నిలిచాయి. మహిళా విభాగంలో విన్నర్ గా కలకత్తా, రన్నర్ గా కేరళ మూడు నాలుగు స్థానాల్లో ఆంధ్ర, హిమాచల్ జట్లు నిలిచాయి. ఫైనల్స్ ఆదివారం అర్ధరాత్రి వరకు జరిగాయి. విజేతలకు ఐదు లక్షలు ప్రైజ్ మనీ షీల్డ్ లను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే జానకిరామ్, టిడిపి నాయకులు కోవ్వలి నాయుడు, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వీర లంకయ్యలు అందించారు.
చిత్తూరు జిల్లా, పుంగనూరు సోమల (మం)లో అయోధ్య శ్రీరామ మందిరంలో శ్రీ బాల రాముని కి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సోమల మండలం లో భక్తులు శోభ యాత్ర నిర్వహించారు. పుంగనూరు బిజెపి ఇంచార్జి మదన్ మోహన్ మాట్లాడుతూ జైశ్రీరామ్ హిందూ బంధువులందరికి ఈ రోజు దీపావళి పండుగ రోజు అని అన్నారు. 450 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న హిందూ బంధువులందరికీ అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట శ్రీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నిర్వహించడము పై యావత్ భారతదేశం గర్వించదగ్గ విషయం అని అన్నారు. ప్రతి ఒక్క హిందువు దేవాలయంలో గాని తన ఇంట్లో ఉన్న పూజ గదిలో గాని అక్షింతలు హోమాలు చేసి శ్రీ.సీతా రాముల కృప పాత్రకు కావాలని కోరారు. సోమల లోని శ్రీరాముని గుడిలో శ్రీ సీతా రాముల కువేద పండితులు చే పూజలు నిర్వహించారు. సోమల బస్ స్టాండ్ నుండి శ్రీ రాముల గుడి దగ్గర నుండి భక్తులు ర్యాలీలో బయలుదేరి జైశ్రీరామ్ అంటూ రామా రామా రఘుపతి రామా అంటూ భక్త పరవశంలో మునిగితేలిన నినాదాలు చేసుకొని వెళ్లిన భక్తులు. అంతే కాకుండా అన్నదానం మరియు రామకోటి ,రాత్రి కి శ్రీ సీతారాముల పల్లకి లో గ్రామోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.
చిత్తూరు జిల్లా, కుప్పం మండల పరిధిలోని బంగారునత్తం చెరువులో శనివారం యువకుడు గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సంజయ్ తల్లిదండ్రులు రవి, మంజుల మీడియాతో మాట్లాడుతూ, తమ బిడ్డ సంజయ్ ను శనివారం ఉదయం 10 గంటలకు సమయంలో రవీందర్ అనే యువకుడు ఇంటి నుండి కారులో తీసుకెళ్ళాడని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఫోన్ లో చివరిగా మాట్లాడామని తెలిపారు. కాగా పక్కా ప్లాన్ తోనే సంజయ్ ను రివిందర్, బాలాజి, రోహిత్ లు చెంపేసి ఉంటారని సంజయ్ తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. డబ్బుల కోసమే తమ కుమారుడిని హత్య చేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. తమ కుమారుడు ఆచుకిని కనుగొని తమకు న్యాయం చేయాలని సంజయ్ తల్లిదండ్రులు కోరుతున్నారు.
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం ఈ రోజు అయోధ్యలోని రామ మందిరం లో బాల రాముని విగ్రహ ప్రతిష్టించుకోవడం కోసం 500 సంవత్సరాలు వేచి చూశామని ఈరోజు నెరవేరిందని విగ్రహన్ని ప్రతిష్ట చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని రామభక్తులు వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఊరు వాడ భక్తిశ్రద్ధలతో శ్రీరామ నామంతో మారుమోగింది వీధి వీధి వాడవాడ భక్తిశ్రద్ధలతో చిన్నలు పెద్దలు అన్న తేడా లేకుండా శ్రీరామ నామస్మరణతో మారుమోగించారు. హిందువుల యొక్క చిరకాల కోరిక అయోధ్య రామ మందిరం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు భారతదేశనికే కాకుండా ప్రపంచ దేశంలో కూడా రాముని యొక్క ప్రతిష్టను పొగుడుతూ రాముని యొక్క గుణగణాలను కీర్తిస్తు దేశంలో మళ్ళీ రామరాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని వ్యక్తం చేసారు.
శంషాబాద్ విమానాశ్రయంలో భారీ మొత్తంలో డ్రగ్ పట్టుబడింది. ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి రూ.41 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితురాలు జాంబియాకు చెందిన లుసాకాగా గుర్తించారు. హెరాయిన్ను డాక్యుమెంట్ ఫోల్డర్లో దాచి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆమె పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గం అంగన్వాడీలు అనుకుని రైతు కూలీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడ అంగన్వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రైతు కూలీలను అంగన్వాడీ కార్యకర్తలు అనుకుని అత్యుత్సాహం ప్రదర్శించిన పొలిసులు. కూలీలు మేము అంగన్వాడీ కార్యకర్తలు కాదు అని చెప్తున్న వినకుండా వారిని స్థానిక ఒక ఫంక్షన్ హల్ కు తరలింపు. అదే ఫంక్షన్ హల్ లో అప్పటికే అదుపులో తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన రైతు కూలీలు. చివరికి రైతు వచ్చి మా పొలంలో పనికి వచ్చిన కూలీలు అని చెప్పిన తర్వాత వారిని వదిలిన పోలీసులు.
శ్రీకాకుళం జిల్లా, టెక్కలి అయోధ్య లో రాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఎన్నో ఏళ్ల కల నేడు సఫలం అయినందున ఆనందం లో దేశం లో అందరూ ఒక్కసారిగా చాలా సంతోషకరంగా తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అదే విధంగా టెక్కలిలో భారీగా ఊరేగింపులు జరపడంతో పాటు భక్తులు జై శ్రీరామ్ అంటూ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసారు.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన సీఐటీయూ నాయకులు, అంగన్వాడీలు. పోలీస్ స్టేషన్ ముందు ఒక్కసారిగా రహదారిపై బైఠాయించిన అంగన్వాడీ ఉద్యోగులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. స్థంబిస్తున్న ట్రాఫిక్. రోడ్ పై బైఠాయించిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు. అడ్డుకున్న అంగన్వాడీ ఉద్యోగులు. పోలీసులు, అంగన్వాడీ వర్కర్స్ మద్య పెనుగులాట, ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన పరిస్థితి పోలీసుల పై తిరగబడుతున్న అంగన్వాడీ ఉద్యోగులు. అదుపులోకి తీసుకోబోయే మహిళా పోలీసులను రోడ్డుపై కూర్చోబెట్టిన అంగన్వాడీ వర్కర్. పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న అంగన్వాడీ వర్కర్స్. నిలువరించలేకపోతున్న పోలీసులు సీఐ మోహన్ రెడ్డి రంగప్రవేశం. పోలీసులను కొడతారా అంటూ అంగన్వాడీ ఉద్యోగులు, సీఐటీయూ నాయకుల పై మండిపడ్డ సీఐ. మహిళా పోలీసుల వల్ల కాకపోవడంతో సీఐ, ఎస్సై కలిసి మహిళలను వాహనం ఎక్కించి తరలిస్తున్న వైనం. పోలీస్ స్టేషన్ లోపల అరుపులు వినపడటంతో మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేసినా. పోలీసులు గేట్లు వేసి మీడియాని లోపలికి అనుమతించని పరిస్థితి.




Total views : 90873