కాకినాడ జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 42వ రోజుకు చేరుకుంది ఒక పక్క ప్రభుత్వం విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరవించేది లేదని కాకినాడ కలెక్టరేట్ వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడీలు వెల్లడించారు. తమని చలో విజయవాడ పిలుపులో భాగంగా పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారని మమ్మల్ని చంపిన మేము సమ్మె విరమించేది లేదంటున్న అంగన్వాడీలు.
cvr live
అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఏలూరులో ధర్మబేరి ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించారు. ఉదయం నుండి హనుమాన్ చాలీసా పారాయణం, అనంతరం యాగ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ సంఘాల నేతలతో పాటు పలువురు ముస్లిం సోదరులు పాల్గొని అయోధ్య లోని బాలరామ విగ్రహ ప్రతిష్టకు సంఘీభావం తెలిపారు.
కాకినాడ, కళ్ళు చేదిరేలా కాకినాడ శోభాయాత్ర. కాకినాడ నగరం వేలాది మంది మార్వాడీలతో కళకళ లాడింది. గుజరాత్ కి చెందిన వందలాది మంది మార్వాడి మహిళలు, యువత, యువకులు ఆనందంగా శోభాయ మానం గా నృత్యాలు చేస్తూ అయోధ్యరామునికి స్వాగతం పలికారు. నగరంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నాయి. వారెవరు చేయని విధంగా మార్వాడీలు అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి ఆయోద్యకే పేరు తెచ్చేలా అందరి మన్ననలు చూరగొన్నారు.
మంచిర్యాల జిల్లా, మందమర్రి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా మందమర్రి పంచముఖి ఆంజనేయ దేవాలయం నుండి పురావిధుల్లో 500 బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున మార్కెట్లో సెంటర్ వరకు నిర్వహించిన అయోధ్య రాముని శోభయాత్రలో పాల్గొన్న హిందూ ఉత్సహం కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించరు. మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఈరోజు వ్యాపార సంఘం వారు ఆధ్వర్యంలో నిర్వహించిన నగర సంకీర్తనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 500 సంవత్సరాల హిందువుల చిరకాల స్వప్నం ఈరోజు నెరవేరనుందని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన ఈ క్షణం ఈరోజు వచ్చిందిదని అన్నారు. ప్రతి ఇంటి లొ సాయంత్రం ఐదు దీపాలు పెట్టుకోవాలి రాత్రి దీపావళి టపాసులు పేల్చడం, సంతోషం తో జరుపుకోవాలని అన్నారు.
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో శ్రీ సీత రాముల ఉత్సవ విగ్రహాలను సోమవారం పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ముందుగా వేణుగోపాలస్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామభక్తులు ఆర్యవైశ్య మహిళ మండలి కమిటీ సభ్యులు కోలాటం చేస్తూ రామనామం జపిస్తూ నృత్యాలు చేస్తూ కోటలోని కోదండ రామస్వామి ఆలయం వరకు కాషాయ జెండాలు పట్టుకుని జైశ్రీరామ్ అంటూ నినాదాలతో ఊరేగింపు నిర్వహించారు. పురవీధులు రామనామంతో మారుమోగాయి. అనంతరం కోదండ రామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తాదులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసారు. మధ్యాహ్నం వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తాదులకు ఆలయం వద్ద భోజన వసతి ఏర్పాటు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ సమీపంలో 44వ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లీ కొడుకు మృతి చెందగా ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసుల వివరాలు ప్రకారం తమిళనాడు రాష్ట్రం కంచి నుండి ధర్మవరం తిరిగి వస్తుండగా పెనుకొండ సమీపంలో కారు బోల్తా పడడంతో ధర్మవరం చెందిన ఒకే కుటుంబం తల్లీ తులసమ్మ, కుమారుడు పార్థసారధి ఘటనలోనే మృతి చెందడం మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వీరిని అనంతపురం ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు. వీరిలో ఇద్దరు పరిస్థితి తీవ్రంగా ఉంది. వీరంతా ధర్మవరం నుంచి కంచి దైవ దర్శనం కి వెళ్లి తిరుగు ప్రయాణంలో పెనుకొండ వద్ద ప్రమాదం చోటు చేసుకోవడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
తిరుపతి జిల్లా, చంద్రగిరి భాకరాపేట ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ ప్రైవేటు బస్సు. నలుగురికి కాళ్ళు చేతులు విరగ్గా పది మందికి పైగా గాయాలు. తిరుపతి-మదనపల్లి ప్రధాన రహదారి లోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల భాకరాపేట ఘాట్ రోడ్డు లో మలుపు వద్ద ఘటన. బళ్ళారి నుంచి చెన్నైకి 40మంది ప్రయాణికులతో వస్తున్న ప్రవేట్ బస్సు. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేక్ ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగింది అంటున్న డ్రైవర్. 4 అంబులెన్స్ లలో తిరుపతి రుయా ఆస్పత్రి కు తరలింపు. ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు సహాయక చర్యలు.
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ పరిధిలో చిన్నారులపై విధి కుక్కల దాడి. 21 వ డివిజన్ ఎల్బీనగర్ లో ఘటన. ఇద్దరు చిన్నారుల పై కుక్కల దాడి. సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు. హాస్పటల్ కి తరలించిన స్థానికులు. గాయపడ్డ వారిలో ఒక బాబు పరిస్థితి విషమం. రోజురోజుకు కుక్కల దాడులు పెరుగుతున్న కూడా చలనం లేనట్లుగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు.
విజయవాడ లో అర్దరాత్రి ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీల టెంట్లు పీకేసిన పోలీసులు. అడ్డుపడిన అండగన్వాడీల అరెస్ట్ చేసిన పోలీసులు. నేడు చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్వాడీలు. ఇప్పటికే బస్టాండ్ , రైల్వేస్టేషన్ లలో పికెటింగ్ నిర్వహిస్తూ అంగన్వాడీలు ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. ఎస్మాచట్టం అమలులో ఉంది కాబట్టి చలో విజయవాడ కు అనుమతి లేదన్న సీపీ. అంగన్వాడీలపై చర్యలకు సిద్దమవుతున్న ప్రభుత్వం. విధులకు హాజరు కాని అంగన్వాడీల తొలగింపుకు ఉత్తర్వులు సిద్దం చేసిన కృష్ణాజిల్లా, పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్లు. 42 రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీలు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం కోడి కత్తి శ్రీనును వెంటనే విడుదల చేయాలంటూ అమలాపురంలో దళిత సంఘాల ఆందోళన. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో దళిత సంఘాల ఆందోళన. జైల్లో ఉన్న కోడి కత్తి శ్రీను వెంటనే విడుదల చేయాలంటూ గడియార స్తంభం సెంటర్లో నిరసన ర్యాలీ చేసిన దళిత సంఘాలు. నిందితుడు అనంత బాబును వదిలేసి దళిత యువకుడు కోడి కత్తి శీను జైలా అంటూ ఆందోళన. ఐదు సంవత్సరాలుగా జైల్లో మగుతున్న కోడి కత్తి శ్రీనుకు సాక్ష్యం చెప్పని ముఖ్యమంత్రి జగన్. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి డబ్బా కొట్టుకుంటున్న ముఖ్యమంత్రి జగన్. నిందితుడు అయిన అనంత బాబుకు బెయిల్ ఇచ్చి దళిత యువకుడి కి బెయిల్ ఇవ్వకపోవడం దారుణం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు హాజరై కోడి కత్తి శ్రీనుకు బైల్ ఇప్పించాలి. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు చేపడుతామటూ హెచ్చరించిన దళిత సంఘాల నేతలు. గడియార స్తంభం సెంటర్లో ఆందోళన నిరసన ర్యాలీ చేపట్టిన దళిత సంఘం నేతలు.





Total views : 90794