జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధురానగర్ లోని శ్రీనివాస కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ కి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ని గెలిపించాలని కాలనీ వాసులకు పిలుపునిచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు అన్ని రంగాలలో వెనకబడి ఉన్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక తెలంగాణ ఇస్తే కెసిఆర్ కుటుంబం అక్రమపాలన కొనసాగిస్తుందని విమర్శించారు. చంద్రబాబు హాయంలో ఐటీ కంపెనీలు అభివృద్ధి చెందాయి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి పరిపాలన అందిచారాన్నారు. ప్రస్తుతం ఉన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కు రాజకీయ బిక్ష పెట్టిన ఎన్టీఆర్ నే విస్మరిస్తున్నార్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పోయి, తెలంగాణ రాష్ట్రం అభిరుద్ధి చెందాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించి, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ కి ఓటు వేసి అత్యధిక మెజారిటితో గెలిపించాలని పిలుపునిచ్చారు.
hyderabad district news
ఈ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం 1లక్ష 60వేల 83 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరో 42 వేల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియలో ఉన్నాయని… తమ కంటే మెరుగ్గా ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఐటీసీ కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ పిల్లలకు చెప్పండని.. ఊరికే గావుకేకలు, పెడబొబ్బలు కాదంటూ ఎద్దేవా చేశారు. ప్రజెంటేషన్ ఇచ్చి… ఫలానా చోట ఇంత కన్న ఎక్కువ చేశామని చెప్పండన్నారు. గుజరాత్లో 6 కోట్లు, రాజస్థాన్లో ఎనిమిదిన్నర కోట్ల జనాభా ఉన్నా.. ఆ రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీ అనుకున్నంత జరగలేదన్నారు. 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో తాము 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఎనిమిదిన్నర కోట్లు, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాలు కూడా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయలేదని తెలిపారు. ఇవి వాస్తవాలని.. ఉద్యోగాల భర్తీకి సంబంధించి వెబ్సైట్ కూడా పబ్లిష్ చేశామని పేర్కొన్నారు. ఇవి వాస్తవాలు కాదని రుజువు చేసే దమ్ము ప్రతిపక్షాలకు ఉందా.. అంటూ ప్రశ్నించారు. ప్రైవేటు సెక్టార్లో కూడా లక్షల ఉద్యోగాలు సృష్టించి, ఉపాధి కల్పించామని కేటీఆర్ తెలిపారు.
మొండా మార్కెట్ లోని ఇందిరాగాంధీ విగ్రహం ముందు,బన్సీలాల్ పేట్ లో ని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రచార హోర్డింగుల ను నిలిపి ఇందిరాగాంధీ కి అవమానం చేశారని సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోర్డింగ్ లు తక్షణమే తీసేసి, అవి పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని నీలిమ తో పాటు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇందిరా గాంధీ విగ్రహం ముందు కు పెద్దఎత్తున చేరుకుని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు.రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాల వద్ద బిఆర్ఎస్ నాయకుల హోర్డింగ్ లు పెట్టిన వారిపై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసే వరకు తమ సత్యాగ్రహ ఆందోళన కొనసాగిస్తామని కోట నీలిమ ప్రకటించారు.
ధరణి తీసేస్తే మళ్ళీ దళారి రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ భూమాతను ప్రవేశపెడతామని చెబుతోందని.. అది భూమేతే అవుతుందని ఎద్దేవా చేశారు. తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పైలట్ రోహిత్రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. రెండు వందల రూపాయలు ఉన్న పింఛను రూ.2వేలు చేశామన్నారు. రైతుల బాగోగుల కోసం రైతుబంధు ప్రవేశపెట్టామన్నారు. మరోసారి అధికారంలోకి వస్తే రూ.16వేలు రైతుబంధు ఇస్తామన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుభీమా డబ్బులు ఎలా వస్తాయన్నారు. రైతుబంధు సొమ్ము దుబారా అని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మూడు గంటల కరెంటు సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంటున్నారు. అలాంటి కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఓటు వేసి ఆగం కావొద్దన్నారు. రాష్ట్రంలో 3500 తండాలను గ్రామ పంచాయతీలు చేయడంతో లంబాడీ బిడ్డలే సర్పంచులుగా రాజ్యమేలుతున్నారన్నారు. బంజారా గౌరవానికి చిహ్నంగా బంజారాహిల్స్లో బంజారా భవన్ నిర్మించామని చెప్పారు.
Read Also….
Read Also….
నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ రిమోట్ ఇప్పుడు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉందని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ కారణంగానే కేంద్రంలో బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తోందని విమర్శించారు. బీజేపీ గెలుపుకు కాంగ్రెస్ తనను బాధ్యుడిగా చెబుతోందని, కానీ ఆ పార్టీ విజయం సాధిస్తే తాను ఎలా బాధ్యుడిని అవుతాను? అని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఆరెస్సెస్తోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు గాంధీ భవన్ రిమోట్ మోహన్ భగవత్ చేతిలో ఉందని ఎద్దేవాచేశారు. ఎవరు ఎన్ని చెప్పినా… బీజేపీతో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలీస్, పి.ఓ పోలింగ్ అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు జిల్లాలోని 15 నియోజకవర్గాలలో ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలలో ఎన్నికల విధులు నిర్వహించే పి.ఓ లు, ఏ.పి.ఓ లు, ఇతర పోలింగ్ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఆయా నియోజకవర్గాల్లో సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలీసు అధి కారికారులు, సిబ్బంది ఆయా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓటు వేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట్ తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ను పరిశీలించారు. అదే విధంగా కార్వాన్ నియోజకవర్గం గోల్కొండ తహశీల్దార్ కార్యాలయం, చార్మినార్ నియోజకవర్గం మొఘల్ పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్, బహదూర్ పుర నియోజకవర్గం బహదూర్ పుర తహశీల్దార్ కార్యాలయం ఫెసిలిటేషన్ సెంటర్ లలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను పరిశీలించారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో దోమల గూడ , ఏ.వి. కాలేజ్ నుండి ప్రారంభమైన రోడ్ షో. మహారాష్ట్ర Dy సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, MP, BJP పార్లమెంట్ బోర్డ్ సభ్యుడు, డా K. లక్ష్మణ్ తో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూస రాజు తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో లో పాల్గొన్నారు.. ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పూసరాజు తో పాటు గాంధీ నగర్ కార్పొరేటర్ పావని వినయ్, రామ్ నగర్ కార్పొరేటర్ రవి చారి, కావాడి గూడ కార్పొరేటర్ రచన శ్రీ వెంకటేష్, ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్, బిజెపి యువమోర్చా కార్యకర్తలు వేల మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీలో భారీ ఎత్తున కార్యకర్తలు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు తరలివచ్చారు.. బిజెపి నినాదంతో దద్దరిల్లిపోయిన ముషీరాబాద్ రోడ్లు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదనీ ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతదనీ, విచక్షణతోటి బాగా ఆలోచించి మంచి అభ్యర్థికి, మంచి పార్టీకి ఓటెయ్యాలి. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఆషామాషీగా ఓటు వేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలం మామిడిపల్లి, శ్రీనివాసుల గూడ, మొదళ్ళ గూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కు ఆయా గ్రామాల్లో ప్రజల నుండి భారీ స్పందన లభించింది. స్ధానిక నేత మాజీ జెడ్పి వైస్ చైర్మన్ నాగర్ కుంట నవీన్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది.. ఏ పార్టీకి ఓటేస్తే చెడు జరుగుతది..? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయగలగాలనీ, ప్రజలకు ఉన్న ఒకే ఆయుధం ఓటు. ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలె’ అని అంజయ్య చెప్పారు. ‘పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటు వేయాలె. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఏందో మీకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ అభివృద్ధి కోసం. తెలంగాణ ఏర్పాటైనంక బీఆర్ఎస్ పార్టీ ఎంత బాగా అభివృద్ధి చేసిందో మీరందరూ చూస్తున్నరు. మరె 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది..? అడుగడుగునా తెలంగాణను మోసం చేసింది. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసిన కరువు కాటకాలే ఉండె. పత్తికాయలు పగిలినట్లు రైతులు గుండెలు పగిలి చనిపోయిండ్రు. అదీ కాంగ్రెస్ పరిపాలన’ అని అంజయ్య ఎద్దేవా చేశారు
పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే ఎంత భద్రంగా ఉంటదో, తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతులో ఉంటే అంతే భద్రంగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు మహేశ్వరం నియోజకవర్గం లోని సరస్వతి గూడ, అగర్మియా గూడ, లేమూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంత్రి మాట్లాడుతూ చుట్టం చూపులాగా ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. నియోజకవర్గ ప్రకారంగా ఎలాంటి అవగాహన లేని వాళ్ళు నియోజకవర్గంలో తిరుగుతున్నారు .ఒకరేమో డబ్బుల సంచులు మోసుకొని తిరుగుతున్నారు, ఒకరేమో కులమతాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చెప్పి తిరుగుతున్నారు.గడచిన తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఎలాంటి కులమతాల మధ్య చిచ్చు లేకుండా, తెలంగాణను సస్యశ్యామలంగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు,ఎంపీటీసీలు, సర్పంచులు,వార్డు సభ్యులు అనుబంధ సంఘాల అధ్యక్షులు,మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సర్కారు బడి సిబ్బంది, ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం.. ఆరేళ్ల చిన్నారిని తాళం వేసున్న తరగతి గదిలోనే ఆరు గంటలపాటు భయం భయంగా గడిపేలా చేసింది.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికంగా నివాసముండే ప్రభావతి సుబ్రహ్మణ్యం దంపతుల కుమార్తె ఒకటో తరగతి. గురువారం సాయంత్రం పాఠశాల ముగిశాక పిల్లలందరూ వెళ్లిపోయారు. కానీ ఆ చిన్నారి బెంచి పై పడుకొని ఉంది. గమనించని సిబ్బంది తరగతి గదికి తాళం వేసి వెళ్ళిపోయారు. రోజు సమయానికి ఇంటికి వచ్చే పాప ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పాఠశాల దగ్గరికి వెళ్లారు. ఆ సమయంలో గదిలో నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా ఆమె కనిపించింది. సిబ్బంది కోసం వెతికినా అక్కడ లేకపోవడంతో.. తలుపులు బద్దలు కొట్టి చిన్నారిని ఇంటికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయుడు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని చిన్నరి తల్లిదండ్రులు వాపోయారు. ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ ఆంజనేయులు పేర్కొన్నారు.




Total views : 89924