సీలేరు లో భారీ గంజాయి పట్టివేత, అల్లూరి జిల్లా జీకె వీధి సీలేరు పోలీసులు వాహనాలు చెకింగ్ లో కోటి 50 లక్షలు విలువ చేసే 725 కేజీలు భారీ గంజాయి పట్టివేత. ఇద్దరు అరెస్టు ముగ్గురు పరారు. అశోక లేలాండ్ గూడ్స్ లారీ మరియు ఒక కారు రెండు సెల్ ఫోన్లు 1300 రూపాయలు నగదు సీజ్. ముద్దాయిలను కోర్టుకు తరలింపు. పరారైన నిందితులను ప్రత్యేక బృందం ద్వారా పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెడతాం చింతపల్లి పోలీస్ డివిజన్ అడిషనల్ ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. అల్లూరు జిల్లా ఎస్పీ తుహాన్ సీనవా చింతపల్లి సబ్ డివిజనల్ అడిషనల్ ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్, ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీలు భాగంగా గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసు,సీలేరు టిఆర్సి క్యాంప్ సమీపంలో వాహనాలు పరిశీలిస్తుండగా అటుగా వస్తున్న లారీ కారును పరిశీలించగా 725 కేజీలు గంజాయి లారీ లో ఉన్నా నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, మహారాష్ట్రానికి చెందిన వాళ్ళని, ఒడిస్సారాష్ట్రం చిత్రకొండలో గంజాయిని కొనుగోలు చేశారని వివరించారు, గంజాయి ముఠాను అదుపులోకి తీసుకొని లారీ,కారు,2సెల్ ఫోన్లు,1300 నగదును సీజ్ చేసి, నిందితులను రిమాండ్కు తరలిస్తామని గంజాయి విలువ కోటి 50 లక్షలు ఉంటుందని తెలిపారు, ఈ కేసును చేదించిన సిఐ అశోక్ కుమార్ ను, సీలేరు ఎస్సై రామకృష్ణను, పోలీస్ సిబ్బందిని అభినందించారు.
Marijuana smuggling
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్టు, 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు. గంజాయి తరలిస్తున్న ఇరువురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తాడేపల్లి గూడెం పట్టణ ఎస్సై కె.సుధాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ , డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ ఆదేశాలతో తాడేపల్లిగూడెం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ SSV నాగరాజు కి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు నిర్వహించినట్లు తెలిపారు. ఎస్సై సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటిరోజున ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ శివారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఇరువురు యువకులు గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గంజాయి తరలిస్తున్న షేక్ అక్బర్, ఓరుగంటి షాలేం రాజు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరు పరచనున్నట్లు వివరించారు. మత్తు, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, తమ జీవితాలను సన్మార్గంలో తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఆయన వెంట ఎస్సై జీజే ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ జి.శ్రీను, కానిస్టేబుల్స్ సి.శ్రీనివాసరావు, కె.రాజు,కె.మహేష్ ఉన్నారు.






Total views : 150011