జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ టైకూన్ జంక్షన్ పరిశీలనకు వచ్చిన నాదెండ్ల మనోహర్ ను అక్రమంగా అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రశ్నించిన వారిని పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీ భూములను కూడా ఆక్రమించుకుని దోచేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వలపేక్షతో కాకుండా రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. మంగళగిరిలో ఓటమి భయంతోనే బీసీ కార్డును తెరపైకి తెచ్చారని మంగళగిరిలో వైసిపి ఓటమికి జనసేన కచ్చితంగా ప్రభావితం చేస్తుందని రాజకీయ దురుద్దేశంతోనే బీసీలను తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే మంగళగిరిలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఎన్నికల పోటీ చేసే విషయంలో జనసేన పార్టీ అధిష్టాన నిర్ణయమే మాకు శిరోధార్యమని తెలిపారు.
nadendla manohar arrest
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కోటికలపుడి గోవిందరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుంది. ఎంపీ స్వార్థానికి రోడ్డు మూసేయటం పై నిరసన తెలపడానికి వెళ్లిన నాదెండ్ల మనోహర్ ను అరెస్టు చేయడం పై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వారిపై కేసును ఎత్తు వేయకపోతే చలో విశాఖపట్నం చేపడతామన్నారు. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులను కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నారని, ప్రభుత్వం అంటే ప్రజలకు అవసరమైన సమస్యలను తీర్చడం కానీ, ఇలా వారి అవసరాల కోసం రోడ్లను సైతం మూసివేసి సైకో పాలన చేస్తున్నారని పద్ధతి మార్చుకోకపోతే 2024లో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
నాదెండ్ల మనోహర్ అరెస్టు ను పుంగనూరు జనసేన ఇంచార్జి, గంగాధర్ ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంగాధర్ మాట్లాడుతూ విశాఖపట్నం లో టైక్వాన్ జంక్షన్ మూసివేసిన ప్రభుత్వం, ఈ విదంగా మూసివేయడం వల న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమం లో ఆ జంక్షన్ ను తిరిగి తెరిపించాలనే కోణం లో శాంతియుతంగా సమస్య ను పరిష్కరించడానికి వెళుతున్న నాదెండ్ల మనోహర్ ను అక్రమ అరెస్టు చేశారని వాపోయారు. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ యొక్క అక్రమ అరెస్టు నియోజకవర్గ స్థాయి లో మా జనసేన కార్యకర్తలు ఖండిస్తూ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న అని జనసేన పార్టీ ఇంచార్జి సి.గంగాధర్ తెలిపారు.
తమ అథినేత నాదెండ్ల మనోహర్ ను విశాఖపట్నం టైకూన్ సెంటర్లో వైజాగ్ పోలీసులు నిర్భందించినందుకు తెనాలిలో జనసైనికులు, వీరనారీమణులు, తెదేపా సభ్యులు ఆందోళనకూ దిగి మార్కెట్ సెంటర్లో రాస్తారోకో చేసి థర్నాకు దిగారు. తర్వాత జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను వదలివేయటం జరిగింది. ఏమిటీ విశాఖ టైకూన్ సెంటర్ వివాదం ? విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్ నుండి విఐపి రోడ్డుకు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసేసారు. నాలుగు నెలల క్రితమే టైకూన్ సెంటర్ వద్ద రోడ్డును మూసేసారు. అయితే ఇలా హటాత్తుగా ప్రజలు ఉపయోగించే రోడ్డును మూసేయాడానికి, ఇదే రోడ్డులో నిర్మిస్తున్న వైసిపి ఎంపి ఎంవివి సత్యనారాయణకి భవనమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ భవనానికి వాస్తు దోషం వుందని ఏకంగా రోడ్డునే మూసేసారని ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల ఆస్తులను అధికారులు ప్రజలు ఉపయోగించే రోడ్డును మూసేయడం దారుణమని జనసేన నాయకులు అంటున్నారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి వెళ్తున్న పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ని అడ్డుకొని అరెస్టు చేయడం అక్రమం అని అన్నారు. వైజాగ్ ఎంపీ లేఅవుట్ వేశారు. దాన్ని కి అన్ని హంగులు సమకూర్చి అమ్ముకోవటానికి, వాస్తు అడ్డు వచ్చినదాని రోడ్డు మూశారు. ఆ రోడ్డు వల్ల ప్రజలు నాలుగైదు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చింది. దాన్ని ప్రశ్నించడానికి వెళ్తున్న నాదెండ్ల మనోహర అడ్డుకొని, అరెస్టు చేయటం హేయమైన చర్య అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కుని కాలరాయకూడదు. పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అరెస్టు చేయటానికి బోర్ర వెంకట అప్పారావు తీవ్రంగా ఖండించారు




Total views : 150199