తమ నివాస ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చెయ్యడం వల్ల ఇబ్బందులు తలేతున్నాయని ఆబ్కారీ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు.
కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం పంచశీల నగర్ ప్రాంతంలో మద్యం షాపు నిర్వహించడం వల్ల పలువురు మద్యం సేవించడానికి వచ్చి అసభ్యకరంగ ప్రవర్తిస్తున్నారని వెంటనే తమ నివాస ప్రాంతం నుంచి మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ
political news
చిరు వ్యాపారాల పైన జులుం ప్రదర్శిస్తున్న దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ మరియు పోలీసులు. అక్రమంగా రాత్రి సమయంలో తమ వ్యాపారాల మొత్తాన్ని కాళీ చేయించారంటు దాచేపల్లి లో కార్మికుల ఆందోళన. పల్నాడు జిల్లా దాచేపల్లి కోట్ల బజారుకు వెళ్ళే దారికి ఇరువైపులా ఉన్న పూల, కాయల బండ్ల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని దాచేపల్లి మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటల నుంచి ఇరువైపులా ఉన్న బండ్లను తొలగిస్తున్న అధికారులు. రోడ్డున పడ్డ వందలాది కుటుంబాలు. మా వ్యాపారాలు మొత్తం పోయాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న రోజు వారి ఫ్రూట్ బండి కార్మికులు. రెక్క ఆడితే కానీ డొక్కా ఆడని బ్రతుకులు మావి, అలాంటిది మా వ్యాపారాలు పోవడంతో మాకు ఆత్మహత్యలే దిక్కు అంటున్న దాచేపల్లి కార్మికులు.
నేడు ఢిల్లీలో తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన, మంత్రిగా ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నైట్ ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ కానున్న వెంకటరెడ్డి. తెలంగాణలో రహదారులకు, జాతీయ రహదారులకు సంబంధించిన అంశాలపై నితిన్ గడ్కరీ తో చర్చించుకున్న వెంకటరెడ్డి. అధికారుల బృందం తోటి కలిసి కేంద్రమంత్రిని కలవనున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని రైతులను పరామర్శించడానికి వచ్చావని. రైతులను పరామర్శించేందుకు వచ్చిన నువ్వు కులమతాల పేరుతో ప్రశాంతంగా ఉన్న మా డెల్టా ప్రాంతానిక తగాదాలు పెడతావా అని మంత్రి నాగార్జున మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుఫాన్ ధాటికి తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల కలెక్టర్లకు సూచనలు ఇచ్చి ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించారని తెలిపారు. వ్యవసాయానికి పెద్ద పీట వేసి రైతులకు అనేక పథకాలు అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. హుదుద్ తుఫాన్ కి చంద్రబాబు తన కొడుకు లోకేష్ ఏం చేశారో జగన్మోహన్ రెడ్డి ఏం సహాయకు చర్యలు తీసుకున్నారు ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు.
గుంటూరు జిల్లా, పెదనందిపాడు రైతు చెప్పిన సమస్యలు విన్న చంద్రబాబు. తుఫాన్ కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రైతులు కనీసం అధికారులు పట్టించుకోలేదని రైతుల ఆరోపణ. తుఫాన్ విషయంలో ప్రభుత్వం వైఫల్యం ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాలో తుఫాన్ వస్తుంటాయి. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా కు నీరు ఇచ్చాము. పట్టిసీమ సక్రమంగా వినియోగిస్తే నీటి ఇబ్బందులు ఉండవు. నీటి ఇబ్బందులు లేకుండా చేయాలని పట్టిసీమ నిర్మించాం. నాగార్జున సాగర్ కుడి కాల్వ కి నీరు ఇచ్చేందుకు ప్రణాళిక చేశాం. పట్టిసీమ పంపులు వేయడం కూడా ఈ ప్రభుత్వం మర్చిపోయింది. నల్లమడ డ్రైయిన్ కి 170 కోట్లు మంజూరు చేశాం.
పొలం గురించి తెలియని వ్యక్తికి పంటల గురించి ఏమి తెలుస్తుంది. ఈ ప్రభుత్వం వలన లక్షల్లో రైతులు అప్పుల పాలయ్యారు. రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడానికి సీఎం కి మనసు రాలేదు. పంట నష్టం గురించి కేంద్రాన్ని కూడా సీఎం జగన్ అడిగే పరిస్థితి లేడు. నాలుగు రోజులైనా ఏ పంటలు..ఎంత నష్ట పోయారో చెప్పే ధైర్యం చెప్పలేదు. ఎంత పంట నష్ట పరిహారం ఇస్తానో కూడా సీఎం జగన్ చెప్పలేదు. రైతులు గట్టిగా అడిగితే కేసులు పెడతారు. రైతు కష్టంలో వున్నప్పుడు దుర్మాగమైన పరిస్థితి తెచ్చారు. పంటలకు భీమా చేసి ఉంటే నష్టం పరిహారం ఇచ్చే అవకాశం ఉండేది. తాను ప్రస్తుతం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న. రైతుకు ధైర్యం చెప్పేందుకు వచ్చా అని వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ చేయకఊతే 3 నెలలో వైకాపాను బంగాళాఖాతంలో కలుపుదాం. ముఖ్యమంత్రికి అల్టిమేట్ ఇస్తున్న. పంటల నష్టం పై కేంద్రానికి కూడా లేఖ రాస్తాను. రాష్టంలో ఎంత పంట నష్టపోయారో ఆన్ లైన్ లో ఉంచాలి. నష్ట పరిహారం వైకాపా దొంగలకు ఇస్తే.. సంగతి తెలుస్తాం. నిజమైన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి. రైతు ద్రోహి జగన్ మోహన్ రెడ్డి. త్వరలో మీ ముందుకు వచ్చి ఏమి చేయబోతున్నామో వివారిస్తా అని చంద్రబాబు వెల్లడించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది తొలిసారి పట్టణానికి విచ్చేసిన వివేక్ వెంకటస్వామికి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజలు కోరుకున్న మార్పు ఈరోజు వచ్చిందని, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నే చెన్నూర్ ప్రజలు బట్టలు విప్పి కొట్టి పంపారని ఆయన అన్నారు. చట్టానికి ఎవరూ చుట్టం కాదని, దానికి అనుగుణంగా అందరూ నడుచుకోవాలని ఆయన తెలిపారు. మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత 6 గ్యారంటీల పై తొలి సంతకం చేశారని, వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 68 వేల మిగులు బడ్జెట్ ను అప్పుల రాష్ట్రంగా మార్చి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు. .కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని,కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఎంక్వైరీ వేసి తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఆయన అన్నారు..
వృధా అయిన ప్రజల సొమ్ము దోచుకున్న సొత్తును తిరిగి కక్కిస్తామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం చెన్నూర్ లో ఉద్యోగాల్లో, మంచి నీటి సరఫరా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ త్వరలో నెరవేరుస్తానని హామీ ఇచ్చారు..ప్రతి మండలంలో తిరిగి ఎం కావాలో,ఏమి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని పరిష్కార దిశగా ముందుకెళుతానని ఆయన చెప్పారు..బ్యాక్ వాటర్ బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తానని,చెన్నూర్ ప్రజలు తమపై ప్రేమ చాలా చూపించారని,మాజీ ఎమ్మెల్యే ఓదెలు ఇతర నాయకులకు చెన్నూర్ ప్రజలకు కృత్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారని,కొత్త నాయకులను పార్టీలో తీసుకునే అవసరం లేదని అయన స్పష్టం చేశారు.. నియోజకవర్గ అభివృద్ధి కొరకై అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఆయన వెంట నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున వున్నారు.
శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి మార్గంలో ప్రొటెక్షన్ వాచర్ పై ఎలుగుబంటి దాడి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఎలుగుబంటి దాడిలో ప్రొటెక్షన్ వాచరు చెవుల వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇష్టకామేశ్వరి వద్ద విధులను పూర్తి చేసుకొని సున్నిపెంటకు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడి చేసి వెంకటేష్ ని అక్కడే వదిలేసి అడవిలోకి వెళ్లిపోవడంతో కొద్దిసేపటికి తేరుకున్న బాధితుడు మోటార్ సైకిల్ సహాయంతో రోడ్డు మార్గంలో ఉన్న ప్రొటెక్షన్ సెంటర్ వద్దకు వెంకటేష్ చేరుకోగా, తీవ్రంగా రక్తస్రావ గాయలతో ఉన్న వెంకటేష్ను హుటాహుటిన సుండిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్ర గాయాలైన వెంకటేష్ కు ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలిస్తున్న అటవీశాఖ అధికారులు వైద్యులు తెలిపారు.
ఈ నెల డిసెంబర్ 9 న కొత్త ఓటరు నమోదు ప్రక్రియ చివరి రోజు గడువు కావడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం బస్టాండ్ సర్కిల్ వద్ద క్యాంప్ నిర్వహించి విద్యార్థులు, అర్హత ఉన్న ప్రజలకి ఓటరు నమోదు పై అవగాహన కల్పించి జనసేన పార్టీ ఐటీ సభ్యుల ద్వారా ఓటు లేని వారికి ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. అలాగే ప్రజలకి తమ ఓటు ఉందో లేదో పరిశీలించుకునే అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ప్రజల తలరాతలు నిర్దేశిస్తుందని , ఓటు విలువ అందరూ గ్రహించాలని , అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ డిసెంబర్ 9 వ తేదీ లోపు ఓట్లు నమోదు చేసుకోవాలని, మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవాలని ,అలాగే ఓటరు లిస్టులో దొంగ ఓట్లు ఉన్నట్లైతే అభ్యతరలు తెలపాలని, గ్రామ, వార్డు స్థాయిలో జనసేన నాయకులు, జనసైనికులు పరిశీలించి ఈ ప్రక్రియ పూర్తి చెయ్యాలని కోరారు.
మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో పిచ్చాటూరు మండలం శివగిరి గ్రామంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు బియ్యం, ఆయిల్, పప్పు లు పంపిణీ చేశారు. ఆర్థిక సహాయం క్రింద ఒక వ్యక్తి ఉన్న కుటుంబానికి 1000 రూపాయలు, ఇద్దరు ఉన్న కుటుంబాలకు 2000 రూపాయలు, ఇద్దరి కన్నా ఎక్కువ ఉన్న కుటుంబాలకు 2500 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో తహాశీల్దార్ మధుసూధన్ రావు, వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ చలపతి రాజు, రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ నాయుడు, ఎంపీటీసీ రమేష్ రాజు,స ర్పంచ్ కిరణ్ నాయుడు విఆర్ఓ రూపేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు _ నారా చంద్రబాబు నాయుడు_ శుక్రవారం బాపట్ల పర్యటన కి రాబోతున్నారు. శుక్రవారం మధ్యహ్నం 3 గంటల ప్రాంతంలో పిట్టలవానిపాలెం మండలం, మంతెనవారి పాలెం గ్రామం లో బాపట్ల నియోజకవర్గం లో ప్రవేశించి అనంతరం బాపట్ల నియోజకవర్గం లో మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి అనంతరం రాత్రికి బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో బస చేసి శనివారం ఉదయం బాపట్ల నుండి బయల్దేరి పర్చూరు నియోజకవర్గం వెళ్తారు అని నరేంద్ర వర్మ తెలిపారు..





Total views : 141654