పర్యావరణాన్ని పరిరక్షించి, జీవవైవిధ్యాన్ని కాపాడినప్పుడే ‘వసుధైక కుటుంబం’ అనే పేరు సార్థకమవుతుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలను ఆసక్తిగా తిలకించారు. సముద్ర తాబేళ్ల రక్షణ కోసం రూపొందించిన మెరైన్ ఫానా యాప్ను పవన్ ప్రారంభించారు. కింగ్ కోబ్రాల సంరక్షణ బ్రోచర్ని ఆయన ఆవిష్కరించారు.
వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజయం సాధించిన వారికి పవన్ బహుమతులు ప్రదానం చేశారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రజలంతా ప్లాస్టిక్ని నిర్మూలించాలన్నారు. అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పవన్ సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- టీడీపీ యూనిట్ ఇంఛార్జ్ల కోసం శిక్షణా తరగతులు.ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇంఛార్జ్ల కోసం…
- ఇరాన్, రష్యాపై ఆంక్షల బిల్లుకు US సెనెట్ గ్రీన్ సిగ్నల్.అమెరికా ఎగువ సభ అయిన యుఎస్ సెనెట్ 2026 ఆగస్టు 7న అత్యంత కీలకమైన “లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026” బిల్లును భారీ మెజారిటీతో ఆమోదించింది. అమెరికా రాజకీయాల్లో తీవ్ర విభేదాలున్నప్పటికీ, ఈ…
- తిరుపతిలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం.తిరుపతి జిల్లాలో అర్ధరాత్రి వేళ ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. చంద్రగిరి మండలం కొంగరివారిపల్లె సమీపంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో కలకలం సృష్టించాడు. చిత్తూరు వైపు నుంచి కట్టెల లోడ్తో అతివేగంగా తిరుపతి…
- తెలంగాణలో మద్యం ధరల పెంచే యోచనలో ప్రభుత్వం.మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బడ్జెట్, మిడ్-రేంజ్, ప్రీమియం సహా అన్ని రకాల బ్రాండ్ల ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై ఏర్పాటు చేసిన సబ్-కమిటీ, సవరించిన ఎంఆర్పీ ధరలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను…
- మూసీ సుందరీకరణకు తొలి అడుగు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టు పనుల్లో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న మొదటి దశ పనులకు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ ఆగస్టు 5న ముందస్తు పర్యావరణ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి