రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం పూజిత అక్షింతల కలశ వితరణ మహోత్సవాన్ని నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాస్కర యోగి హాజరైనారు. ఈ కార్యక్రమంలో అయోధ్య నుంచి శ్రీరాముని అక్షింతలను తీసుకువచ్చి ప్రతీ ఇంటింటికి పంపించే కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాల్ని నిర్వహించి శ్రీరామునీ రాజ్య పరిపాలన, ఆయన గొప్ప తనం గురించి వివరించారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామానికి అక్షింతలు పంపించి డిసెంబర్ వరకు హనుమాన్ దేవాలయంలో పెట్టి హనుమాన్ చాలిసను పఠించి జనవరి 1 తరువాత ప్రతి గడపగడపకు అందించాలని ఈ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాస్కరా యోగీ, బీజేపి నాయకులు, భజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు.
rangareddy district news
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని చెందిప్ప గ్రామ పరిధిలో ఉన్న 124 సర్వే నంబర్ గల 8.22 ఎకరాల భూమిని హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ముస్లిం వ్యక్తులు మొత్తం 7.22 ఎకరాలా భూమిని తమ పేరు మీద పట్ట భుమిగా మార్చి జెసిబి లు తీసుక వచ్చి సాప్ చేపిస్తున్న క్రమంలో గ్రామస్థులు తెలుసుకోని అడ్డుకోవడం జరిగింది. ఈ విషయంపై పోలీసులు కలుగజేసుకొని అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క భూమి ఎప్పుడు సాగులో లేదు ఇది ఒక కొండ ప్రాంతంగా మాత్రమే ఉండేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ కొండపైన ఒక మసీదు మరియు కొండ కింది ప్రాంతంలో ముస్లింల స్మశానవాటిక ఉండేది. ఇట్టి భూమిపై కన్నేసిన భూ బకాసురులు 2016 నుంచి పట్టా భూమిగా మార్చుకొని కబ్జాలకు తీసుకునే ఉద్దేశంతో జెసిబిలు పెట్టి సాప్ చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ యొక్క భూమి 2016 వరకు లావని పట్టాగా ఉండేదని ఇందులో కొంత భూమి అనగా ఒక ఎకరం వరకు కడమంచి వారి పై ఉన్నట్టు తెలుస్తోంది. కడమంచి వారిపై ఉన్న భూమి లావిని పట్టగాను చూపిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఎమ్మార్వో ను అడగగా తను లేనని తర్వాత కలుస్తానని దాటవేస్తున్నారని అక్కడి ప్రజలు తెలిపారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదనీ ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతదనీ, విచక్షణతోటి బాగా ఆలోచించి మంచి అభ్యర్థికి, మంచి పార్టీకి ఓటెయ్యాలి. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఆషామాషీగా ఓటు వేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలం మామిడిపల్లి, శ్రీనివాసుల గూడ, మొదళ్ళ గూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కు ఆయా గ్రామాల్లో ప్రజల నుండి భారీ స్పందన లభించింది. స్ధానిక నేత మాజీ జెడ్పి వైస్ చైర్మన్ నాగర్ కుంట నవీన్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది.. ఏ పార్టీకి ఓటేస్తే చెడు జరుగుతది..? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయగలగాలనీ, ప్రజలకు ఉన్న ఒకే ఆయుధం ఓటు. ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలె’ అని అంజయ్య చెప్పారు. ‘పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటు వేయాలె. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఏందో మీకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ అభివృద్ధి కోసం. తెలంగాణ ఏర్పాటైనంక బీఆర్ఎస్ పార్టీ ఎంత బాగా అభివృద్ధి చేసిందో మీరందరూ చూస్తున్నరు. మరె 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది..? అడుగడుగునా తెలంగాణను మోసం చేసింది. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసిన కరువు కాటకాలే ఉండె. పత్తికాయలు పగిలినట్లు రైతులు గుండెలు పగిలి చనిపోయిండ్రు. అదీ కాంగ్రెస్ పరిపాలన’ అని అంజయ్య ఎద్దేవా చేశారు
మేడ్చల్ నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి మల్లారెడ్డి , ఘట్కేసర్ మండల పరిధి పోచారంలో నిర్వహించిన రోడ్ షో కు భారీగా తరలివచ్చిన జనం. అభివృద్దికే జనం పట్టంకడతారని , కేసిఆర్ వైపు జనం ఉన్నారని , పదేళ్ల కాలంలో అభివృద్ది వైపు అడుగులు వేస్తూ, ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి ధ్యేయంగా కేసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి గుర్తు చేశారు. అత్తలేని పత్తాలేని కాంగ్రెస్, బిజెపి, పార్టీలు..కాంగ్రెస్ అంటే స్కాంలు తప్ప, స్కీము లేవంటూ మంత్రి మల్లారెడ్డి, ఇసుక పడ్డాడు..కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదని, మరి కాంగ్రెస్ చెప్పే గ్యారంటీలు ఉంటాయా అని ఎద్దేవా చేశారు..
మూడవసారి BRS జెండా ఎగురవేసి , ప్రజల అభివృధి లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన మంగలి ఆకాష్ (14) లక్ష్మరావు గూడా గ్రామ సమీపంలో ఉన్న క్వారీలో గత బుధవారం 15/11/2023 రోజు దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది.. వివరాల్లోకి వెల్తే: మంగలి ఆకాష్ అనే విద్యార్థి షాబాద్ లోని నవజీవన్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు బుధవారం 15/11/2023 పాఠశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన ఒక మహిళ స్కూటీ తీసుకొని వెళ్ళిపోయాడు ఆ స్కూటీ ఆచూకీ లక్ష్మారావు గుడా గ్రామ సమీపంలో ఉన్న క్వారీ దగ్గర కనిపించింది అక్కడ స్కూటీ తో పాటు విద్యార్థి చెప్పులు కూడా ఉన్నాయి అయితే క్వారీలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు గ్రామ సర్పంచ్ సహాయంతో డి ఆర్ ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు ఈ డి ఆర్ ఎఫ్ బృందాలు రెండు రోజులు శ్రమించిన ఫలితం లేకపోయింది ఆ యొక్క క్వారీ లోతు దాదాపు 200 అడుగులు ఉండడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించారు ఈరోజు ఉదయం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి మృతదేహాన్ని వెలికి తీశాయి. తన తల్లిదండ్రులు అనుమానానికి కారణం తన ఇన్స్ట గ్రామ్ లో పెట్టిన స్టేటస్ అని తెలుస్తున్నది. మృతదేహాన్ని పంచనామ నిమిత్తం చేవెళ్లలోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు..
Read Also…
Read Also…
దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి కోరారు. కేసీఆర్ది సంక్షేమమని, ప్రతిపక్షాలది సంక్షోభమని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం నాడు కందుకూరు మండలంలోని మాదాపూర్, కోలన్ గూడ, గుమ్మడివెల్లి, ఆకుల మైలారం, మీర్ ఖాన్ పేట్, అన్నోజిగూడ, గూడూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనవని, ప్రజలు బాగా ఆలోచించి నిర్ణ యం తీసుకోవాలని కోరారు. ఎన్నో పథకాలను అమలు చేస్తున్న కారు పార్టీ ఇటువైపు ఉంటే.. ఎన్నికలు సమీపించగానే ప్రజల ముందుకు వచ్చి మొసలి కన్నీరు కార్చే కాంగ్రెస్, బి జె పి మరో వైపు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తుంటే, కేవలం మూడు నుంచి నాలుగు గంటలు వ్యవసాయ కరెంటు ఇస్తున్న కర్ణాటక మోడల్ ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం దివాళాకోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరో వైపు సందర్భం దొరికిన ప్రతీ సారి తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదీ వైఖరిని కూడా అర్థం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ర్టానికి గుండు సున్నా ఇచ్చిన మోదీ దేవుడని బి జె పి నాయకులు అంటున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం చేసింది కేసీఆరేనని, ఇకముందు చేయబోయేది కూడా కేసీఆరేనని పేర్కొంటూ మళ్లీ బి అర్ ఎస్ పార్టీని గెలిపించి కేసీఅర్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పారు.
Read Also….
చేవెళ్ళ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరుగా కొనసాగుతుందని చెప్పవచ్చు ఈ రోజు షాబాద్ మండలంలోని సోలిపేట, మద్దూరు, హైతబాద్, నాగర్ గూడ, తిర్మాలపుర్, దోస్వాడ మరియు తాళ్లపల్లి గ్రామాలలో బీజేపి అభ్యర్ధి రత్నం ప్రచారానికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రత్నం మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గం లో ఎమ్మెల్యే ఒక దొంగని అన్ని పదవులను తన కుటుంబం వారే అనుభవిస్తున్నారని ఆ కుటుంబ పాలన అంతమెందించడమే బిజెపి లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే కాంగ్రెస్ అభ్యర్థి అయిన భీం భారత్ నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని క్రిమినల్ కేసులు గల వ్యక్తి అని వారికి మీరు ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నీ మేమే అందిస్తున్నామని చెప్పుకుంటూ మోసపూరితమైన మాటలు చెప్తున్నారని వాటిని ప్రజలు ఎవరు నమ్మవద్దని బిజెపికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. షాబాద్ ను డెవలప్ చేశామని అంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం చందనవెల్లి రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం ఎందుకు ఇయ్యలేదని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు ముందు చందన వెళ్లి రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించవలసింది ఆయన కోరారు మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఉన్న భూములు కూడా గుంజుకుంతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Read Also..




Total views : 90859