Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Latest News చేవెళ్ళలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపి అభ్యర్ధి..

చేవెళ్ళలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపి అభ్యర్ధి..

by Prakash
bjp candidate rathnam

చేవెళ్ళ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరుగా కొనసాగుతుందని చెప్పవచ్చు ఈ రోజు షాబాద్ మండలంలోని సోలిపేట, మద్దూరు, హైతబాద్, నాగర్ గూడ, తిర్మాలపుర్, దోస్వాడ మరియు తాళ్లపల్లి గ్రామాలలో బీజేపి అభ్యర్ధి రత్నం ప్రచారానికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రత్నం మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గం లో ఎమ్మెల్యే ఒక దొంగని అన్ని పదవులను తన కుటుంబం వారే అనుభవిస్తున్నారని ఆ కుటుంబ పాలన అంతమెందించడమే బిజెపి లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే కాంగ్రెస్ అభ్యర్థి అయిన భీం భారత్ నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని క్రిమినల్ కేసులు గల వ్యక్తి అని వారికి మీరు ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నీ మేమే అందిస్తున్నామని చెప్పుకుంటూ మోసపూరితమైన మాటలు చెప్తున్నారని వాటిని ప్రజలు ఎవరు నమ్మవద్దని బిజెపికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. షాబాద్ ను డెవలప్ చేశామని అంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం చందనవెల్లి రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం ఎందుకు ఇయ్యలేదని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు ముందు చందన వెళ్లి రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించవలసింది ఆయన కోరారు మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఉన్న భూములు కూడా గుంజుకుంతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

027145
Total views : 151624

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.