అంబర్పేట డిడి కాలనీలో ఈనెల 19న జరిగిన చైన్ స్నాచింగ్ కేసును చేదించిన అంబర్పేట పోలీసులను అభినందించిన ఈస్ట్ జోన్ డిసిపి గిరిధర్ రావు….అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని డిడి కాలనీలో ఈనెల 19న సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక మహిళ వాకింగ్ చేస్తుండగా బైక్ పై వెనక నుండి వచ్చిఆమె మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారన్న మహిళ ఫిర్యాదును స్వీకరించిన అంబర్పేట పోలీసులు దర్యాప్తుని చేపట్టారు చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఉప్పల్ ప్రాంత నివాసి అయిన గడ్డం సునీత్ కుమార్@బన్నీ(24) గా గుర్తించారు.v ఇతనితో పాటు ఇతనికి సహకరించిన మరో ఇద్దరు పోతంశెట్టి రవి, రాజేష్ రాథోడ్ లను కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిసిపి గిరిధర్ రావు తెలిపారు..ఈ నేరానికి పాల్పడిన గడ్డం సునీత కుమార్ కు ఈ మధ్యనే పెళ్లి తన భార్య విలాసవంతమైన జీవితం కోరుకుంటున్నదని దానికోసమే ఈ నేరానికి పాల్పడ్డాడని ఈ నేరం చేయగా వచ్చిన డబ్బుతోనే గోవాలో బాగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చి తమిళనాడులోని నాగపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని ఈ ముగ్గురి నుండి రెండు తులాల గోల్డ్ చైన్ ఒక బైకు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని తరలించినట్లు డిసిపి గిరిధర్ రావ్ తెలిపారు…
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 91197