కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హామీల వర్షం కురిపించారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తామన్నారు. జనవరిలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్నారు. అలాగే రేషన్ కార్డులపై సన్నబియ్యం కూడా ఇస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ఐదు లక్షల భీమా అందిస్తామని హామీ ఇచ్చారు. పెన్షన్ దశలవారీగా ఐదు వేల రూపాయలకు పెంచుతామని చెప్పారు.
#telangana
తెలంగాణలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్లో నిర్వహించిన రోడ్షోలో ఆమె పాల్గొన్నారు. ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే అదీ నెరవేరలేదన్నారు. ఉద్యోగ పరీక్షల పేపర్లను లీక్ చేసి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందన్నారు. రూ. 400 గ్యాస్ సిలిండర్ ధరను రూ. వెయ్యికి పైగా పెంచారని విమర్శించారు. ధరణి పోర్టల్ తో భూములను లాగేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం సహకరించుకుంటున్నాయని ప్రియాంక గాంధీ విమర్శించారు.
Read Also..
Read Also..
హైదరాబాద్ పద్మారావు నగర్ లో BRS పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత బైక్ ర్యాలీని ప్రారంభించారు సనత్ నగర్ MLA అభ్యర్థి తలసాని. ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. ప్రచారానికి చివరిరోజు కావడంతో మంత్రి తలసాని భారీ ర్యాలీని తలపెట్టారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రదేశాల్లో ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మళ్లీ దొరల ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నాంపల్లిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మన దేశ సంస్కృతి ఇది కాదన్నారు. కాంగ్రెస్ ను డ్యామేజ్ చేసేందుకు బీజేపీ యత్నిస్తుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు అవినీతి జరిగిందన్నారు. కాంగ్రెస్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఎంఐఎం పోటీ చేస్తుందని ఆరోపించారు. అవినీతిపరుడైన కేసీఆర్పై ఒక్క కేసు కూడా లేదన్నారు. మోదీ సర్కార్ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రజల సర్కార్ వస్తుందని రాహుల్ చెప్పారు.
నేటితో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న క్రమంలో అభ్యర్థుల్లో టెన్షన్ పీక్స్కు చేరుకుంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. ఈసారి తనను గెలిపించకపోతే భార్యా, బిడ్డతో కలిసి ఉరివేసుకుంటానని వేడుకున్నారు. చంపుకుంటారో, సాదుకుంటారో మీ ఇష్టమని హాట్ కామెంట్స్ చేశారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయని, ఫలితాలలో తనను గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఒక్క సారి తనకు అవకాశం కల్పించాలని 30వ తేదీన కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Read Also..
Read Also..
ముఖ్యమంత్రి కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి చేయకుండా తాను గద్దినెక్కాడని తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టిస్తానని ప్రజలకు హామీ ఇచ్చి ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని, 9 ఏళ్ల క్రితం రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానన్నావు చేసావా, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కల్పించారా అంటూ సిఎంని టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు చేసారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మాటలు చెప్పే మనిషే కానీ మాట మీద నిలబడే మనిషి కాదని దళితున్ని ముఖ్యమంత్రి ని చేస్తానని చెప్పి తానే తొమ్మిది ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిని అనుభావిస్తున్న మాటకరని రాష్టంలో ఉన్న నిరీద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా తన కుటుంబ సభ్యులకు పదవులను కట్టబెట్టిన ఘనత కేసీఆర్ ది అన్నారు. ఈరోజు యావత్ రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగానికి ఉచిత కరెంట్ వస్తుందంటే అందులో తన పాత్ర ఉందని ఆనాడు రైతులకు అదనంగా కరెంట్ చార్జీలు వసూలు చేస్తుంటే రైతు సమస్యలపై పోరాడి కొట్లాడి రైతన్నలకు ఉచిత కరెంట్ కల్పించిన ఘనత నాది అన్నారు. వందలాది మంది యువకులు తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పిట్టల్లా చనిపోతుంటే చూడలేక మంత్రి పదవిని సైతం రాజీనామా చేశాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో నాపాత్ర ఉందని ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. గత 19 యేండ్లుగా నియోజకవర్గంలో నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని నేడు మీరు చూస్తున్న ప్రాజెక్టులు రైతు బంధు రైతు భీమా నీటి కాలువలు పెంక్షన్లు సీసీ రోడ్లు కరెంట్ ప్రభుత్వ భవనాలు ఇలా చెప్పుకుంటు పోతే నేడు మీరు చూస్తున్న అభివృద్ధి నేను చేసిన అభిద్దే అన్నారు. ప్రజలు తెలంగాణ రాష్టంని ఇచ్చిన సోనియా గాంధీ ఋణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కాదని వేరే పార్టీలకు ఓటు వేస్తే మళ్ళీ ఇక్కడి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నే గెలుస్తాడు అన్నారు. పేద ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలకోసం శ్రామిస్తానని కాంగ్రెస్ పార్టీని నన్ను మళ్ళీ ఒకసారి ప్రజలు అదరించి 30 న జరిగే ఎన్నికల్లోఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
Read Also…
Read Also…
మల్కాజీగిరిలో ఎంపీగా రేవంత్ రెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపానపోలేదని అన్నారు. కూకట్ పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఈ ఉదయం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ బడ్జెట్ నుండి రేవంత్ రెడ్డి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు అన్నారు మాధవరం. రాష్ట్రానికి ప్రజలకు బీజేపీ ఏమీ చేసింది లేదు. ప్రజలకు పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, అభివృద్ధి కార్యక్రమాల చేపట్టన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమించిన తనకు ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు.
పదేళ్ళలో ఎమ్మెల్యేగా తాను చేసిన పనిని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని కూకట్పల్లి బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేలా కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూకట్పల్లి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వేసే ముందు ఈ పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని గమనించి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కే పట్టం కట్టాలని కోరారు. మల్కాజ్గిరి నుండి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, స్థానికుడైన తనకు పరిష్కరించిన, పరిష్కరించాల్సిన సమస్యల పై పూర్తి అవగాహన ఉందని, బయట నుండి వచ్చిన వారికి నియోజకవర్గం పై అవగాహన కూడా లేదని, ఓటు వేసే ముందు అన్ని విధాలా ఆలోచించి అభివృద్ది, శాంతి భద్రతలతో మతసామరస్యాన్ని కాపాడుతున్న బిఆర్ఎస్ పార్టీ.ఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకున్న సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు బోయిన్పల్లిలోని కార్పొరేటర్ ముద్దమ్ నరసింహ యాదవ్ తో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.. ఈ సందర్భంగా యువత భారీ ఎత్తున హాజరై బైక్ ర్యాలీ నిర్వహిస్తూ గల్లి గల్లి కి బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చూపుతూ ముందుకు సాగారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కేవలం ఒక్కరోజు మాత్రమే గడువున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని ఈ పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని గమనించి తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు …హిందూ, ముస్లిం అనే భేదం లేకుండా అందరం అన్నదమ్ముల వలె ఇక్కడ నివసిస్తున్నామని.. తిరిగి మళ్ళీ ఇదే ప్రశాంతమైన జీవనం కొనసాగాలంటే కారు గుర్తుపై ఓటు వేయాలని తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తే మరిన్ని నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళదామని కోరారు…
Read Also…
Read Also…
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఉన్న మలక్కా జలసంధి ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ తుపానుగా బలపడుతుందని తెలిపింది. తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 25 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. పోలింగ్ అనంతరం ఈవిఎం యంత్రాల తరలింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జిల్లాలలో పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శివలింగయ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, ఈవిఎం యంత్రాల తరలింపు, కౌంటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు, యువత, దివ్యాంగులను పోలింగ్ లో భాగస్వామ్యం చేసేలా, చర్యలు తీసుకోవాలని, మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రచార సమయం జిల్లాలోని నియోజకవర్గల్లో నవంబర్ 28 సాయంత్రం 5 గంటలకు, ప్రచారం ముగుస్తుందని, అనంతరం 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ పాటించాల్సి ఉంటుందని అన్నారు. పోలింగ్ నిర్వహణకు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని, విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు కల్పించాలని అన్నారు. పోలింగ్ అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ కు ఈ.వి.ఎం. యంత్రాల తరలింపు కోసం అవసరమైన వాహనాలను సిద్ధం వున్నాయి అన్నారు. జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రిటర్నింగ్ అధికారి పాలకుర్తి), రోహిత్ సింగ్, ఉప ఎన్నికల అధికారిని సుహాసిని, జనగామ, స్టేషన్ ఘన్పూర్, రిటర్నింగ్ అధికారి, మురళీకృష్ణ, రామ్మూర్తి, ఎన్నికల నోడల్ అధికారులు ఇస్మాయిల్, వినోద్ కుమార్, అనిల్ కుమార్, ఆధికారులు పాల్గొన్నారు..





Total views : 141722