అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడు సాయి తేజ గత మూడు నెలల కిందట ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. ఈ క్రమంలోనే సాయి తేజ అమెరికాలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తూ చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే కొందరు దుండగులు షాపింగ్ మాల్లోకి చొరబడి సాయి తేజపై కాల్పులు జరిపి అందులోని నగదును ఎత్తుకెళ్లారు.ఈ ఘటనలో సాయి తేజ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ఇండియన్ ఎంబస్సీ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు తెలంగాణలోని అధికారులకు సమాచారం ఇచ్చారు. అది కాస్త తల్లిదండ్రులు, బంధుమిత్రులకు తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటన మహబూబ్ నగర జిల్లాలోని భూత్పూర్ ఠాణా ఎదుట చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై ముందున్న లారీ టైరు పేలిపోవడంతో బస్సును అదుపుచేసే క్రమంలో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ బస్సులో దాదాపు…
- అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.ఏపీ రాజధాని అమరావతి అంటే ఇక గ్రాఫిక్స్ కాదు… గ్రౌండ్లో కనిపిస్తున్న రియాలిటీ. రాజధాని రోడ్లపై రయ్మంటూ దూసుకెళ్లే వాహనాలకు మరో కొత్త మార్గం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో…
- మంచిర్యాల జిల్లాలో ముగిసిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు.మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల సాంస్కృతిక ప్రదర్శనలు, భారీ ర్యాలీ నిర్వహించి తమ ఐక్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడారు.…
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థుల ఆందోళన.జనగామ జిల్లా కేంద్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.. కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదని విద్యార్థులు…
- విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పవిత్ర కాశీ నగరం వారణాసికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి