తిరుమలలో భక్తుల రద్దీ సాధరణం. నేడు శ్రీవారి దర్శనం కోసం 06 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న శ్రీవారి భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 58,874 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం 3.50 కోట్లు. శ్రీవారికి 17,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టోకెన్ లు లేని భక్తులకు 8 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.
ttd temple
తిరుపతి అభివృద్దిలో టిటిడి భాగస్వామ్యం ఉండాలని నగరపాలక సంస్ధలోకి నిధులు మళ్ళీంచరాదని అఖిలపక్షం నాయకులు పేర్కొన్నారు. టిటిడి నిధులతో తిరుపతి అభివృద్ది అనే అంశం పై నగరంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తిరుపతి అభివృద్ది టిటిడి స్వయం పర్యవేక్షణలో జరగాలని కోరారు. నగర ప్రజలు ప్రేక్షక పాత్ర వహించకుండా అధికార పార్టీ పై ఒత్తిడి తీసుకవచ్చి టిటిడి లో వచ్చే ఉద్యోగ అవకాశాలు పోందాలని, తిరుపతి అభివృద్దికి టిటిడి గరిష్టంగా నిధులు వెచ్చించాలని డిమాండ్ చేశారు. నగరంలోని పలు విద్యాసంస్ధలు, ఆస్పత్రుల ఏర్పాటులో టిటిడి కీలకమని గుర్తు చేశారు. తిరుపతి అభివృద్దికి భాజపా అడ్డంకిగా మారడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
రాజకీయాల కోసం నీజాయితీ కలిగిన నాలాంటి అధికారిపై అబద్ధపు ఆరోపణలు చేయడం సరైన సాంప్రదాయం కాదని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అన్నారు. నెల్లూరుకు చెందిన టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. వెంకటరమణారెడ్డి తనపై చేసిన ఆరోపణలపై చర్చించేందుకు తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. దేవాదాయశాఖ చట్టం సెక్షన్ 107 ప్రకారం టీటీడీ ఇఓ గా నియామకం కావాలంటే జిల్లా కలెక్టర్ లేదా సమాన హోదాలో పని చేసి వుండాలనే విషయాన్ని వెల్లడించారు.1991 సివిల్ సర్వీసెస్ బ్యాచ్ కి చెందిన నేను ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరి హోదా పోస్టులో భాధ్యతలు నిర్వర్తించాలన్నారు. నా నియామకం పై హైకోర్టులో పిల్ ధాఖలు చేస్తే దానిని హైకోర్టు కోట్టివేసిన విషయాన్ని ధర్మారెడ్డి తెలిపారు. 2014లో డిల్లీ కంటోన్మెంట్ డిఫెన్స్ సిఇఓగా వున్నప్పుడు అక్రమ కట్టడాలు పై చట్టపరంగా చర్యలు తీసుకున్నామన్నారు.దానికి సంబంధించి తాము సీల్ వేసిన ఓ భవనం యజమాని ఆరేళ్ల తర్వాత 2020లో కోర్టులో ప్రవైట్ కేసు వేస్తే దానికి సంబంధించి సమన్లు గత ఏడాది జారి చేసారు. సమన్లు అందుకున్న అనంతరం తాను హైకోర్టును ఆశ్రయించగా ఆ కేసులో కోర్టు స్టే విధించిన్నట్లు తెలిపారు. తాను టిటిడి లో అవినీతి చేసానని ఆరోపించడంపై తీవ్ర ఆగ్రహం చెందారు. తాను వచ్చిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో టీటీడీకి ఎంత ఆదాయం వచ్చింది, ఏమేమి నిర్మించామో ఎలా నిర్మించాము అనేది బహిరంగ చర్చకు తను సిద్ధమని, ఆనం దీనిని స్వీకరిస్తారా అని అన్నారు




Total views : 61930