బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు తెలంగాణ భవన్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహకాలపై నేతలతో ఆయన చర్చించనున్నారు. ఇక నల్గొండ జిల్లా కేంద్రంలో ఏదో ఒక నియోజక వర్గంలో మాజీ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనుట్టు తెలుస్తోంది. అదీ ఈ నెల మూడో వారంలో కేసీఆర్ సభ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. 2 లక్షల మందితో ఫిబ్రవరి మూడో వారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ పై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్గా, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ భారీ సభ నిర్వహించనుంది. నల్లగొండ జిల్లా నుండే KRMB ఇష్యూ పై పోరాటానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోందని తెలిపారు. ఈ భారీ సభపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు కేసిఆర్ దిశానిర్దేశం చేశారు.Read Also..
రేపు తెలంగాణ భవన్ కు రానున్న కేసీఆర్
394
previous post






Total views : 90747