వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు కూటమిగా ఏకమయ్యాయి. ఇండియా ప్రధాని అభ్యర్థిత్వంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరో 2024 ఎన్నికల తర్వాతే నిర్ణయించుకుంటామన్నారు. బీజేపీని ఓడించమే లక్ష్యంగా సీట్ల పంపకంతో పాటు పలు సమస్యల్ని తమ కూటమిలోనే పరిష్కరించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. మూడోసారి కూడా నరేంద్ర మోదీయే ప్రధాని అవుతారంటూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా దీదీ స్పందిస్తూ అది అంత తేలిక కాదన్నారు. ముఖ్యంగా హిందీ బెల్ట్లో బీజేపీ ప్రభావం పెరుగుతోందంటూ విలేకర్లు ప్రస్తావించగా బీజేపీబలంగా లేదు అలాగే, మేం కూడా బలహీనంగా ఉన్నాం. దీన్ని అధిగమించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. హిందీ బెల్ట్, ఇతర ప్రాంతాల మధ్య వివక్షతో చూడటం నాకు ఇష్టంలేదు అన్నారు.
మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
353
previous post




Total views : 79222