29
హైదరాబాద్ నగరంలోని పేదల సొంతింటి కలను సాకారం చేసేలా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని అల్పాదాయ వర్గాల కోసం రూపొందించిన ‘ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని’ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అజారుద్దీన్ కలిసి సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇల్లు, స్థలం లేని అల్పాదాయ వర్గాల కోసం టవర్ల రూపంలో ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. ఒక్కో టవర్లో 10 అంతస్తులు.. ప్రతి అంతస్తుకు 12 ఫ్లాట్లు ఉండేలా ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసింది.



Total views : 221436