32
రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలోని వివాదాస్పద భూములకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేస్తూ, అక్కడి రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. బహదూర్గూడలోని సర్వే నెంబర్లు 3, 4 పరిధిలో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనంటూ నలుగురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గత 30 ఏళ్లుగా ఆ భూముల్లో రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం, సదరు భూముల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ముందస్తు ఆదేశాలతో పిటిషన్ దాఖలు చేసిన నలుగురు రైతులకు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లయింది.



Total views : 221438